అతడొక సృజనాత్మక ఆలోచనల యంత్రం. యాంత్రికత తెలియని సృజనాత్మకత అతని సొంతం. కాలంతో పోటీ పడుతూ చాలాసార్లు తానే గెలుస్తూ అలా సాగిపోయే తత్వం. తరుముకొచ్చే పనుల మధ్య నిరంతరం ఒక చిరునవ్వు ముద్దబంతిని ధరిస్తాడు. దిరిశన పూవు కన్నా ఫ్రెష్ గా ఉంటాడు.
’80లో జీవశాస్త్రం పూర్తిచేసి హైదరాబాదు సిసియంబిలో పనిచేస్తూ పిహెచ్.డి (1988) కోసం పారీస్ బాట పట్టాడు. కొంత కాలం అక్కడ పనిచేస్తూ తగిన పనికోసం అమెరికా పయనమయ్యాడు.
అక్కడ నాలుగేళ్ళు కొలంబియా మరియు ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కాల్ ఆఫ్ మెడిసన్ లో పోస్ట్ డాక్టరేట్ ఫెలోగా చేరాడు. 1993 నుండి 2002 వరకు ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. 1996-2001 వరకు సిటి యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ లో విద్యాబోధన చేశారు. ఆతదుపరి (1999-2001) లాంగ్ ఐలాండ్ జ్యూయిష్ మెడికల్ సెంటర్ లో పరిశోధన కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు.
అదే సమయంలో జీవ సంబంధ పరిశోధనా రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసి తన సత్తా చాటాడు.
చదువుకునే రోజుల్లో తన భార్య వసుంధరకి రాసిన ప్రేమ కవితలు ఆ తరువాత సామాజిక కవిత్వంగా మారింది. నాకన్నా కవిత్వం మా ఆవిడే బాగా రాస్తారని చెబుతారు. 80 లలోనే తాను రాసిన రెండొందల కవితలు పోగొట్టుకున్నా కవిత్వం మీద విశ్వాసం సడలలేదు. ఇప్పటికీ కవిత్వాన్ని సెకండ్ లవ్ గానే భావిస్తాడు.
వెబ్లో పెట్టిన రచనలకన్నా రెండింతల రచనలు దాచి పెట్టకపోవడం వల్ల లభ్యం కావడంలేదు. రచయితగా కన్నా శాస్త్రవేత్తగానే ఎక్కువగా మమేకం కావడంవల్ల రచనలు దాచుకోవాలనీ, అచ్చేసుకోవాలనీ, పుస్తకాలుగా తీయాలని అనుకోలేదు. ఇకముందు కూడా అచ్చువేయరా అంటే వేయాల్సొస్తే వేస్తాను. వేయకపోయినా లోకానికి నష్టమేమీ లేదని చెబుతారు. రచన ఒక అవసరం. ఆ సందర్భంలో అది అనివార్యం. ఆ తరువాత దాని గురించి తంటాలు పడడం నాకెందుకో అలవాటు కాలేదు. అందుకే నేను రచయితగా పనికి రానేమో అంటారు.
స్వస్థలం విజయనగరంలోని బొబ్బిలి. తన ఊరంటే వల్లమాలిన అభిమానం. తన బాల్య స్మృతుల గురించి చెప్పేప్పుడు అక్కడి జీవితం తలచుకుని వైబ్రంట్ గా మారిపోతారు. భారతదేశంలో తాను చేసే పనులకు విజయనగరాన్ని చిన్న కేంద్రం చేసుకున్నారు. ప్రథమ్ (2001) అనే ఫౌండేషన్ ని ఆంధ్రప్రదేశ్ లో (www.pratham.org) ఆరంభించారు.
సామాన్యులకు వందలాది గ్రామాల్లో ప్రాథమిక చదువు చెప్పిస్తున్నారు. వాళ్ళతో పుస్తకాలు చదివింపచేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చదువు నేర్చిన వారినే చదువు నే్ర్పే బాలసాక్షి పెట్టి విద్యా పథకాన్ని కొనసాగిస్తున్నారు. 2004 నుండి సుమారు 350 గ్రామాల్లో పల్లెటూరు గ్రంథాలయోద్యమం అనే దాన్ని ప్రారంభించారు. స్థానికుల సహకారంతోనే దాన్ని విజయవంతం చేశారు. స్థానిక ప్రజల అండదండలు లేనిదే అక్కడ మనం చేబట్టే కార్యక్రమాలు ఏవీ సఫలం కావని ఆయన భావన. ఈనాటికీ ఆ పల్లెటూళ్ళళ్ళో పుస్తకాల రెపరెపల శబ్దాలు వినిపిస్తాయి. ఆ చిరుసవ్వడి వినడానికి ఆయన ఎంతదూరంలో ఉంటేనేం? వానపాములా ఆ కార్యక్రమం సజీవంగా కదులుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమం పదకొండు జిల్లాల్లో కొనసాగించడం విశేషం. ఎన్నో పనుల వత్తిడిలో ఉన్నా ప్రథమ్- విజయనగరాల్ని చూడకుండా అతి దగ్గరగా వచ్చి వాటిని తాకకుండా భారతదేశపు సరిహద్దులు దాటిపోడు.
సామాన్యులకి విద్య చెప్పడం ఒక కర్తవ్యంగా భావించే శ్రీనివాసరావు బయో టెక్నాలజి శాస్త్రాన్ని కూడా అభివృద్ధి పరిచి విదేశాల్లో భారతదేశం పేరు గుర్తింపు తీసుకురావాలని హైరానా పడతాడు. ఇండియావస్తే ఇవ్వాళ ఇక్కడ, రేపు ఈశాన్య ప్రాంతంలో, మరోరోజు మరో చోట! కొన్ని ఆలోచనలు, మరికొన్ని నిర్దిష్టమైన పథకాలతో అతని సంచారం. న్యూయార్క్ లోని సొంతింట్లో ఉండేది తక్కువ. సంచారంలోనే సగం జీవితం గడిపే శ్రీనివాసరావు అందులోనే చాలా విషయాలు నేర్చుకుంటూ వాటిని ఇతరులకు నేర్పుతుంటాడు. లోగడ శాంతా బయోటెక్ సంస్థ అమెరికా విభాగం ఇన్ ఛార్జిగా ఉంటూ కంపెనీ లావాదేవీలు చూస్తూనే పరిశోధనలపై కూడా తన పట్టు నిలుపుకోవడం గొప్ప విషయం.
ప్రస్తుతం శాంతా బయోటెక్ వారి నిర్వహణాధికారం మారిన తరువాత కన్సల్టెంట్ గా ఉంటూ కంపెనీ పరమైన పనులు చేసిపెడుతూ శాస్త్రపరమైన పరిశోధనలు, పరిశీలనలు ఇస్తూ, సేవ చేస్తున్నారు.
ఈ క్షణాన భారతదేశంలో “ఇండియన్ ఇన్ట్సిట్టూట్ ఆఫ్ బయోటెక్నాలజీ” సంస్థ ఏర్పాటు గురించి తలమునకలై ఉన్నా – సాహిత్యం, అందునా తెలుగు సాహిత్యంపై రెండుకళ్ళూ, ఒక మనసు పెట్టి ఉన్నారు. మూడు నాలుగేళ్ళ నుండి పుస్తకరూపంలో రచనలు రావాలంటే ఠలాయించే శ్రీనివాసరావు ప్రస్తుతం తన రచనలను వెబ్ లో ఉంచడానికి నిమిత్తమాత్రంగా అంగీకరించారు.
ఎప్పుడూ ఏదో చేయందే చేస్తూ ఉండందే... నిద్రపోని శ్రీనివాసరావు పరిశోధన మినహా మరేం చేశాడని గూఢచర్యం వహిస్తే తప్ప తెలిసిరాలేదు. ’85 నుండి 88 వరకు పారిస్ లో భారతదేశ ఉత్సవాలను, వివిధ సందర్భాల్లో దేశకీర్తి ఇనుమడింపచేసే కార్యక్రమాల్ని నిర్వహించాడు. అమెరికాకొచ్చాక (1990-94) తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ఏర్పాటు చేసి ట్రస్టీ మరియు కార్యదర్శిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. న్యూయార్క్ వెళ్ళిన చాలామంది తెలుగు సాహిత్యవేత్తలు వారి ఆతిథ్యం తీసుకోనివారు ఉండరేమోనంటే అతిశయోక్తే అవుతోంది. అతిథి మర్యాదకు విజయనగరమైనా న్యూయార్కైనా ఒక్కటే అంటారాయన. 1995 నుండి న్యూజెర్సీ, న్యూయార్కుల్లో నెలవారి తెలుగు సాహిత్య సమావేశాలు ఏర్పాటు చేశారు. ఏతావాతా తేలిందేమంటే ఏపనైనా పునాది స్థాయి నుండి చేయడం ఆయన అభిమతం. అప్పుడే ఎంతో కొంత ఫలితం సాధించగలమని నమ్మకం.
ఎనిమిదేళ్ళ క్రితం హైదరాబాదొచ్చినప్పుడు చైనావాళ్ళకున్నట్లు గొప్ప వేయి గ్రంథాల్ని కంప్యూటరీకరించి భూగోళం మీదున్న ప్రతి తెలుగువాడికి అందించాలని ఆలోచించాడు. నలుగురిని కూడేసి తన ఆలోచనని పంచుకున్నాడు. నిజానికి ఆ వేయి గ్రంథాలేవి? అవెప్పుడెప్పుడు ఎన్ని ముద్రణలు పొందాయనే సమాచారం లభించే చోటు కోసం వెదికాడు. కంప్యూటరీకరణ తరువాత ముందు తెలుగులో ఎన్ని పుస్తకాలు అచ్చయ్యాయని అడిగాడు. ఎవరూ ఇతమిద్దంగా సమాధానం చెప్పలేకపోయారు. వందా ఎనభై ఏళ్ళనుండి అచ్చయిన తెలుగు పుస్తకాల పట్టిక తయారు చేయడానికి ముందుకు వచ్చారు. కమిటీలు, సమావేశాలు జరిగాయి. వాటిలో చర్చించి “సమగ్ర తెలుగు వాఙ్మయ సూచి” తయారు కోసం వందలాది గ్రంథాలయాల పర్యటన ప్రారంభమైంది. తానే స్వయంగా పారిస్ లోని బబ్లియోతెకా గ్రంథాలయంలో ఉన్న అచ్చయిన, అచ్చుకాని వ్రాతప్రతుల పట్టికలు, బ్రిటిష్ లైబ్రరీలోని గ్రంథాల సూచికలు తెప్పించడంలో కృషి చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సుమారు మూడు లక్షలు తెలుగు గ్రంథాల వివరాలు అకారాది క్రమంలో ఉంచడానికి నిరంతరం తన వంతు సహకారం అందించడంలో వెనకంజ వేయలేదు. ఇదంతా సొంత దేశంలో తెలుగు సాహిత్యానికి చేసిన సేవ గురించిన విషయాలు ఇవి.
ఇకపోతే ఆయనలో ఒక నిబద్ధుడైన కార్యకర్త ఉన్నాడు. ఎక్కడైనా ఏ సంస్థ నిర్మాణంలోనైనా ఒదిగిపోయి అందుకు సహకరిస్తుంటాడు. అమెరికాలో ఎకో ఫౌండేషన్ (1996)కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్నారు. తెలుగు కళాసమితి సంస్థని స్థాపించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. “గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్” సంస్థలో శాశ్వత సభ్యుడు. సామాజిక అభివృద్ధికోసం పాటుపడే అనేక సంస్థలలో వీరు సభ్యులుగా, అధ్యక్షులుగా ఉన్నారు.
నాలుగేళ్ళనుండి “కేటలిస్ట్ ఫర్ హ్యూమన్ డెవలప్ మెంట్ (http://www.athod.org) అనే పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. అమెరికా, ఇండియా దేశాలలో గల మిత్రులతో ఈ పత్రికని తెస్తున్నారు. ప్రస్తుతం దాని చిరునామా హైదరాబాదే! ఈ పత్రికలో గొప్ప పనులు, ప్రాజెక్టులు, ప్రజలకోసం పనిచేసే సంస్థలనీ, వ్యక్తులనీ పరిచయం చేస్తారు. జరుగుతున్న అభివృద్ధి, అభివృద్ధి జరగాల్సిన రంగాలు, జరిపే తీరు గురించి నలుగురికి తెలియచెప్పి అందులో వారిని భాగస్వాములుగా చేయాలనే ఆశయంతో ఈ పత్రిక నడుస్తున్నది.
’80లో జీవశాస్త్రం పూర్తిచేసి హైదరాబాదు సిసియంబిలో పనిచేస్తూ పిహెచ్.డి (1988) కోసం పారీస్ బాట పట్టాడు. కొంత కాలం అక్కడ పనిచేస్తూ తగిన పనికోసం అమెరికా పయనమయ్యాడు.
అక్కడ నాలుగేళ్ళు కొలంబియా మరియు ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కాల్ ఆఫ్ మెడిసన్ లో పోస్ట్ డాక్టరేట్ ఫెలోగా చేరాడు. 1993 నుండి 2002 వరకు ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. 1996-2001 వరకు సిటి యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ లో విద్యాబోధన చేశారు. ఆతదుపరి (1999-2001) లాంగ్ ఐలాండ్ జ్యూయిష్ మెడికల్ సెంటర్ లో పరిశోధన కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు.
అదే సమయంలో జీవ సంబంధ పరిశోధనా రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసి తన సత్తా చాటాడు.
చదువుకునే రోజుల్లో తన భార్య వసుంధరకి రాసిన ప్రేమ కవితలు ఆ తరువాత సామాజిక కవిత్వంగా మారింది. నాకన్నా కవిత్వం మా ఆవిడే బాగా రాస్తారని చెబుతారు. 80 లలోనే తాను రాసిన రెండొందల కవితలు పోగొట్టుకున్నా కవిత్వం మీద విశ్వాసం సడలలేదు. ఇప్పటికీ కవిత్వాన్ని సెకండ్ లవ్ గానే భావిస్తాడు.
వెబ్లో పెట్టిన రచనలకన్నా రెండింతల రచనలు దాచి పెట్టకపోవడం వల్ల లభ్యం కావడంలేదు. రచయితగా కన్నా శాస్త్రవేత్తగానే ఎక్కువగా మమేకం కావడంవల్ల రచనలు దాచుకోవాలనీ, అచ్చేసుకోవాలనీ, పుస్తకాలుగా తీయాలని అనుకోలేదు. ఇకముందు కూడా అచ్చువేయరా అంటే వేయాల్సొస్తే వేస్తాను. వేయకపోయినా లోకానికి నష్టమేమీ లేదని చెబుతారు. రచన ఒక అవసరం. ఆ సందర్భంలో అది అనివార్యం. ఆ తరువాత దాని గురించి తంటాలు పడడం నాకెందుకో అలవాటు కాలేదు. అందుకే నేను రచయితగా పనికి రానేమో అంటారు.
స్వస్థలం విజయనగరంలోని బొబ్బిలి. తన ఊరంటే వల్లమాలిన అభిమానం. తన బాల్య స్మృతుల గురించి చెప్పేప్పుడు అక్కడి జీవితం తలచుకుని వైబ్రంట్ గా మారిపోతారు. భారతదేశంలో తాను చేసే పనులకు విజయనగరాన్ని చిన్న కేంద్రం చేసుకున్నారు. ప్రథమ్ (2001) అనే ఫౌండేషన్ ని ఆంధ్రప్రదేశ్ లో (www.pratham.org) ఆరంభించారు.
సామాన్యులకు వందలాది గ్రామాల్లో ప్రాథమిక చదువు చెప్పిస్తున్నారు. వాళ్ళతో పుస్తకాలు చదివింపచేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చదువు నేర్చిన వారినే చదువు నే్ర్పే బాలసాక్షి పెట్టి విద్యా పథకాన్ని కొనసాగిస్తున్నారు. 2004 నుండి సుమారు 350 గ్రామాల్లో పల్లెటూరు గ్రంథాలయోద్యమం అనే దాన్ని ప్రారంభించారు. స్థానికుల సహకారంతోనే దాన్ని విజయవంతం చేశారు. స్థానిక ప్రజల అండదండలు లేనిదే అక్కడ మనం చేబట్టే కార్యక్రమాలు ఏవీ సఫలం కావని ఆయన భావన. ఈనాటికీ ఆ పల్లెటూళ్ళళ్ళో పుస్తకాల రెపరెపల శబ్దాలు వినిపిస్తాయి. ఆ చిరుసవ్వడి వినడానికి ఆయన ఎంతదూరంలో ఉంటేనేం? వానపాములా ఆ కార్యక్రమం సజీవంగా కదులుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమం పదకొండు జిల్లాల్లో కొనసాగించడం విశేషం. ఎన్నో పనుల వత్తిడిలో ఉన్నా ప్రథమ్- విజయనగరాల్ని చూడకుండా అతి దగ్గరగా వచ్చి వాటిని తాకకుండా భారతదేశపు సరిహద్దులు దాటిపోడు.
సామాన్యులకి విద్య చెప్పడం ఒక కర్తవ్యంగా భావించే శ్రీనివాసరావు బయో టెక్నాలజి శాస్త్రాన్ని కూడా అభివృద్ధి పరిచి విదేశాల్లో భారతదేశం పేరు గుర్తింపు తీసుకురావాలని హైరానా పడతాడు. ఇండియావస్తే ఇవ్వాళ ఇక్కడ, రేపు ఈశాన్య ప్రాంతంలో, మరోరోజు మరో చోట! కొన్ని ఆలోచనలు, మరికొన్ని నిర్దిష్టమైన పథకాలతో అతని సంచారం. న్యూయార్క్ లోని సొంతింట్లో ఉండేది తక్కువ. సంచారంలోనే సగం జీవితం గడిపే శ్రీనివాసరావు అందులోనే చాలా విషయాలు నేర్చుకుంటూ వాటిని ఇతరులకు నేర్పుతుంటాడు. లోగడ శాంతా బయోటెక్ సంస్థ అమెరికా విభాగం ఇన్ ఛార్జిగా ఉంటూ కంపెనీ లావాదేవీలు చూస్తూనే పరిశోధనలపై కూడా తన పట్టు నిలుపుకోవడం గొప్ప విషయం.
ప్రస్తుతం శాంతా బయోటెక్ వారి నిర్వహణాధికారం మారిన తరువాత కన్సల్టెంట్ గా ఉంటూ కంపెనీ పరమైన పనులు చేసిపెడుతూ శాస్త్రపరమైన పరిశోధనలు, పరిశీలనలు ఇస్తూ, సేవ చేస్తున్నారు.
ఈ క్షణాన భారతదేశంలో “ఇండియన్ ఇన్ట్సిట్టూట్ ఆఫ్ బయోటెక్నాలజీ” సంస్థ ఏర్పాటు గురించి తలమునకలై ఉన్నా – సాహిత్యం, అందునా తెలుగు సాహిత్యంపై రెండుకళ్ళూ, ఒక మనసు పెట్టి ఉన్నారు. మూడు నాలుగేళ్ళ నుండి పుస్తకరూపంలో రచనలు రావాలంటే ఠలాయించే శ్రీనివాసరావు ప్రస్తుతం తన రచనలను వెబ్ లో ఉంచడానికి నిమిత్తమాత్రంగా అంగీకరించారు.
ఎప్పుడూ ఏదో చేయందే చేస్తూ ఉండందే... నిద్రపోని శ్రీనివాసరావు పరిశోధన మినహా మరేం చేశాడని గూఢచర్యం వహిస్తే తప్ప తెలిసిరాలేదు. ’85 నుండి 88 వరకు పారిస్ లో భారతదేశ ఉత్సవాలను, వివిధ సందర్భాల్లో దేశకీర్తి ఇనుమడింపచేసే కార్యక్రమాల్ని నిర్వహించాడు. అమెరికాకొచ్చాక (1990-94) తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ఏర్పాటు చేసి ట్రస్టీ మరియు కార్యదర్శిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. న్యూయార్క్ వెళ్ళిన చాలామంది తెలుగు సాహిత్యవేత్తలు వారి ఆతిథ్యం తీసుకోనివారు ఉండరేమోనంటే అతిశయోక్తే అవుతోంది. అతిథి మర్యాదకు విజయనగరమైనా న్యూయార్కైనా ఒక్కటే అంటారాయన. 1995 నుండి న్యూజెర్సీ, న్యూయార్కుల్లో నెలవారి తెలుగు సాహిత్య సమావేశాలు ఏర్పాటు చేశారు. ఏతావాతా తేలిందేమంటే ఏపనైనా పునాది స్థాయి నుండి చేయడం ఆయన అభిమతం. అప్పుడే ఎంతో కొంత ఫలితం సాధించగలమని నమ్మకం.
ఎనిమిదేళ్ళ క్రితం హైదరాబాదొచ్చినప్పుడు చైనావాళ్ళకున్నట్లు గొప్ప వేయి గ్రంథాల్ని కంప్యూటరీకరించి భూగోళం మీదున్న ప్రతి తెలుగువాడికి అందించాలని ఆలోచించాడు. నలుగురిని కూడేసి తన ఆలోచనని పంచుకున్నాడు. నిజానికి ఆ వేయి గ్రంథాలేవి? అవెప్పుడెప్పుడు ఎన్ని ముద్రణలు పొందాయనే సమాచారం లభించే చోటు కోసం వెదికాడు. కంప్యూటరీకరణ తరువాత ముందు తెలుగులో ఎన్ని పుస్తకాలు అచ్చయ్యాయని అడిగాడు. ఎవరూ ఇతమిద్దంగా సమాధానం చెప్పలేకపోయారు. వందా ఎనభై ఏళ్ళనుండి అచ్చయిన తెలుగు పుస్తకాల పట్టిక తయారు చేయడానికి ముందుకు వచ్చారు. కమిటీలు, సమావేశాలు జరిగాయి. వాటిలో చర్చించి “సమగ్ర తెలుగు వాఙ్మయ సూచి” తయారు కోసం వందలాది గ్రంథాలయాల పర్యటన ప్రారంభమైంది. తానే స్వయంగా పారిస్ లోని బబ్లియోతెకా గ్రంథాలయంలో ఉన్న అచ్చయిన, అచ్చుకాని వ్రాతప్రతుల పట్టికలు, బ్రిటిష్ లైబ్రరీలోని గ్రంథాల సూచికలు తెప్పించడంలో కృషి చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సుమారు మూడు లక్షలు తెలుగు గ్రంథాల వివరాలు అకారాది క్రమంలో ఉంచడానికి నిరంతరం తన వంతు సహకారం అందించడంలో వెనకంజ వేయలేదు. ఇదంతా సొంత దేశంలో తెలుగు సాహిత్యానికి చేసిన సేవ గురించిన విషయాలు ఇవి.
ఇకపోతే ఆయనలో ఒక నిబద్ధుడైన కార్యకర్త ఉన్నాడు. ఎక్కడైనా ఏ సంస్థ నిర్మాణంలోనైనా ఒదిగిపోయి అందుకు సహకరిస్తుంటాడు. అమెరికాలో ఎకో ఫౌండేషన్ (1996)కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్నారు. తెలుగు కళాసమితి సంస్థని స్థాపించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. “గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్” సంస్థలో శాశ్వత సభ్యుడు. సామాజిక అభివృద్ధికోసం పాటుపడే అనేక సంస్థలలో వీరు సభ్యులుగా, అధ్యక్షులుగా ఉన్నారు.
నాలుగేళ్ళనుండి “కేటలిస్ట్ ఫర్ హ్యూమన్ డెవలప్ మెంట్ (http://www.athod.org) అనే పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. అమెరికా, ఇండియా దేశాలలో గల మిత్రులతో ఈ పత్రికని తెస్తున్నారు. ప్రస్తుతం దాని చిరునామా హైదరాబాదే! ఈ పత్రికలో గొప్ప పనులు, ప్రాజెక్టులు, ప్రజలకోసం పనిచేసే సంస్థలనీ, వ్యక్తులనీ పరిచయం చేస్తారు. జరుగుతున్న అభివృద్ధి, అభివృద్ధి జరగాల్సిన రంగాలు, జరిపే తీరు గురించి నలుగురికి తెలియచెప్పి అందులో వారిని భాగస్వాములుగా చేయాలనే ఆశయంతో ఈ పత్రిక నడుస్తున్నది.
0 వ్యాఖ్యలు:
Post a Comment