ఇరవై ఐదో ఏట దాకా ఇండియాలో బతికి వచ్చి అమెరికాలో మరో ఇరవై ఐదేళ్ళు బ్రతికిన నాకు అమెరికా అయినా ఇండియా అయినా ఒకటే అన్న భావన చాలా గట్టిగా ఉండేది. అమెరికాలో పగలైతే ఇండియాలో రాత్రి, ఇండియాలో పగలైతే అమెరికాలో రాత్రి అని మొదలుపెట్టి ‘అక్కడ’ ‘ఇక్కడ’ అని వాదించే వాళ్ళను పట్టించుకొనే వాడిని కాదు. అలాంటి నాకు కనువిప్పు కలిగించింది వాసా విశాలాక్షి గారి వాక్యం. ‘ఇండియాలో ఇరవైలలో అరవైలలా బ్రతికిన నేను అమెరికాలో నా అరవైలలో ఇరవైలలా బ్రతుకుతున్నాను.’
వాసా విశాలాక్షిగారు న్యూయార్కులో సంగీతం టీచరు. కర్ణాటక సంగీతానికి చేతులడ్డుపెట్టి ఒక ‘కాపు’ కాస్తున్నాం అని అనుకొంటున్న ఎందరో వ్యక్తుల కంటే, సంస్థల కంటే, ఎక్కువ. ‘పెద్దకాపు’ వాసా విశాలాక్షి గారు. ముప్పైఏళ్ళుగా ఆవిడ న్యూయార్క్ లో ఉన్నారని గాని, ఎంతో సంగీత సేవ చేస్తున్నారని కాని మనం న్యూయార్కులో ఎన్నాళ్ళున్నా మీకు నాకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆమెని ఏ సంఘాలు గుర్తించలేదు. అవార్డులు ఇవ్వలేదు. ఇండియా ఎబ్రాడ్ న్యూస్ పేపరులో వ్రాయలేదు. ఆవిడ చేస్తున్న సేవని, ఆవిడ ఉనికిని నలుగురికి తెలిసేలా చేసింది ఓ తెల్లవాడు. అతడికి సంగీతంకాని, భారతదేశం గురించికాని ఏమీ తెలీదు. అసలు భారతదేశం అనేది ఉందని కూడా తెలియదు.
అతడికి తెలిసిందంతా రోజూ ‘ఎలాగో ఒకలాగ’ డబ్బులు ‘సంపాదించి’ ‘డ్రగ్స్’ తీసుకొని ఆనందో బ్రహ్మ అని జీవితం గడపడం. అలాంటి వాడికి సంగీత విద్వాంసురాలు, పూజ చెయ్యకుండా పచ్చి మంచినీళ్ళు అయినా ముట్టని, పరాయివాళ్ళ ఇళ్ళల్లో పళ్ళు తప్ప మరేమీ తినని ఛాందసురాలైన వాసా విశాలాక్షి గారికి లింకేమిటని ఆశ్చర్యపోకండి. ఉంది.
ప్రతిరోజూ ఉదయం పూజ చేసుకొని, మడిగా వంట వండి భర్తకి పెట్టి, తాను తిని, పట్టుచీర కట్టుకొని లోపల థెర్మల్స్ (చలిని తట్టుకోడానికి తొడుక్కునే లోపలి గుడ్డలు) తొడుక్కోకని, మఫ్లర్ కట్టుకొని, న్యూయార్కు బస్సులలో, సబ్ వేలో తిరుగుతూ అభిరుచి ఉన్న వాళ్ళకి సంగీత పాఠాలు చెప్పడం ఆమె దినచర్యలో భాగం. అటువంటి ఆమెని ఒకరోజు సబ్వేలో ఓ తెల్లవాడు అటకాయించి ‘మగ్గింగ్’ అనే మెనహటనం స్టైల్ ముష్టికై ప్రయత్నించాడు. ఆమె మగ్గింగ్ కోసం దాచుకొన్న ఐదు డాలర్లు ఇచ్చే అంతలో ఆమె శృతి పెట్టెని పట్టుకొన్నాడు. అపుడు శృతి పెట్టె పట్టుకొన్న ఆమె చెయ్యిని తాకాడు. ఐదు డాలర్లు ఇద్దామనుకొన్న ఆమెకి వాడు చెయ్యి తాకడం వల్ల మడికి భంగం అయి కోపం వచ్చింది.
“ముష్టి వెధవ్వి ముష్టి వెధవలా ఉండక ముట్టుకొని నా మడిని మైల చేస్తావా?” అని అరిచింది. ఆమె ఆవేశాన్ని ఆమె గాత్రం అద్భుతంగా అనువదించింది. పక్కవాడు చచ్చిపోతున్నా పట్టించుకోని జనాన్ని నిలబెట్టింది. గొడవైంది. పోలీసులొచ్చారు. ఓస్ ఇంతేనా? అని వెళ్ళిపోయారు. అలాంటి పోలీసుల్ని ఆపి ‘మడి’ దాని ప్రాముఖ్యత గట్రా వివరించారు. అటువంటి తప్పుని అమెరికా ఖండంలో చేసేవారిని వదిలేస్తే ఈ ఖండం అపవిత్రమైపోతుందన్నారు. ముష్టి వాళ్ళు ముష్టి అడగడం మనం ఇవ్వడం సనాతన ధర్మం అని చెప్పారు. ఆమె చెపుతున్న విషయం కంటే ఎంతసేపైనా వినాలనిపించే ఆమె గొంతు వినడానికై మరిన్ని ప్రశ్నలు వేసారు పోలీసులు. ముచ్చటపడి కేసు రాసి, నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. అమెరికాలో క్రైం న్యూసు ఎక్కువ. కాని అందులో ఇండియన్ పేర్లు అతి తక్కువ. అంచేత మనం ఇక్కడ ఉన్నామని నలుగురికి తెలియదని, న్యూయార్కు అంటే ‘మెల్టింగ్ పాట్’ అని అది సంస్కృతుల సంగమం అని అందులో ఇవాళ ‘మడి’ అనే భారతీయ సంస్కృతికి సంబంధించిన విషయం అమెరికాలో క్రైం కి కొత్త కోణాన్ని ఇస్తుందని న్యూయార్కులోని ఇండియన్ ప్రెస్ విజృంభించింది.
వాసా విశాలాక్షిగారి ఇంటి ఎడ్రస్ పట్టుకొన్నారు. కెమేరాలు వెంట తెచ్చుకొన్నారు. ఆమెని వివిధ ప్రశ్నలు వేసారు. ఆమెకి ఇది ప్రథమ ఇంటర్వ్యూ అవడం వల్ల ఆమే ఏ సమాధానం చెప్పకుండా ముందు ‘మహా గణపతిం....’ అంటూ మొదలు పెట్టారు. ఆ తరవాత ఆమె అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పారు. ఆమె జీవిత చరిత్ర అంతా వివరించారు. మగ్గింగ్ పాలబడ్డా మరేమి జరిగినా అమెరికానే నచ్చిందన్నారు. విలేఖర్లు వివరంగా చెప్పమన్నారు. ఎన్నో కారణాలు వివరాలు ఎందుకు ఒక్కటి చాలన్నారు ఆమె. ఆ సమాధానమే ‘అమెరికాలో అరవైలలో ఇరవై, ఇండియాలో ఇరవైలలో అరవై.’ అదెలా అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది ఇరవైలలో ఉన్న జుహి ఝం ఝాంగ్ వాలా అన్న విలేఖరిణి.
‘నాకు ఇరవైయవ ఏట పెళ్ళైంది. నేను వాళ్ళింట కాలు పెట్టిన వేళా విశేషమేమో కాని నా భర్తకి ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది. తుళ్ళుతూ, తేలుతూ, తిరుగుతూ సంగీతం ఊపిరిగా బ్రతుకుతున్న మా పల్లెటూరి నుండి’ ఢిల్లి వెళ్ళిన నాకు అదో పెద్ద జైలులా అనిపించింది. వాసావారింటి అబ్బాయి అని మానాన్న నన్ను ఒప్పించి చేసిన పెళ్ళి నాది. వారి ఇంట ఉన్న సంగీత సంప్రదాయాన్ని గౌరవించి అటువంటి కుటుంబంలో పుట్టిన ఆయనకి ‘ఇంగువ కట్టిన గుడ్డ’ లా ఎంతో కొంత సంగీతం రాదా అని అనుకొన్నాం. అయితే అది మా రోజుల్లో పెళ్ళిచూపుల్లో పెళ్ళి కూతురు అడిగే ప్రశ్న లేదుకదా. పెళ్ళైన తరువాత తెలుసుకొందాం అని వాయిదా వేసాను. ఢిల్లీ వెళ్ళిన తరువాత తెలిసింది అది ‘ఇంగువ కట్టిన గుడ్డే’ కాని మా ఆయన తరంలో అది ‘సర్ఫ్’ వేసి శుభ్రంగా ఉతికి ఆరేసిన బట్ట అని. ఆయనకి సంగీతం రాకపోతేనేం నలుగురికి పాఠాలు చెప్పుకొని నా సంగీతాన్ని నిలబెడదాం అనుకొన్నాను. కాని కుదిరేది కాదు. రోజు తెల్లవారు ఝామున మూడు గంటలకి లేచి నీళ్ళుపట్టుకోవాలి. ఐదు గంటలకి పాలబూత్ దగ్గరికి వెళ్ళి పాలు తెచ్చుకోవాలి. ఆరుగంటలకి భర్తనిలేపి కాఫీ అందించాలి. ఏడు గంటలకి పిల్లల్ని లేపి తయారు చెయ్యాలి. వంట చెయ్యాలి. వాళ్ళను బస్సెక్కించాలి. భర్తకి టిఫిన్ పెట్టాలి. కేరేజ్ కట్టి ఇవ్వాలి. మార్కెట్ కి వెళ్ళాలి. ఆ తరువాత ఇంత తిని పడుకొందామంటే కుదరదు. కొత్తగా కొన్న టీవి చూడడానికి రోజూ పొరుగువాళ్ళు వస్తారు. కునికిపాట్ల మధ్య చూస్తూ లేస్తూ ఉండేసరికి పిల్లలు వచ్చేస్తారు. రాత్రి పదిదాకా ఏవేవో పనులు. పడుకొనేసరికి పదకొండు. మళ్ళీ తెల్లవారు ఝామున మూడు గంటలకి లేవడం. అలా పనిచేసి చేసి నా ఇరవైలలో అరవై ఏళ్ళ దానిలా తయారయ్యాను. నాకు వచ్చిన సంగీతానికి కనీసం ఓ గంటైనా ఆ రోజుల్లో దొరికేది కాదు. కాని ఇపుడు అరవైలలో అమెరికాలో నాకు నచ్చిన సంగీతాన్ని నలుగురికి నేర్పుకొంటున్నాను. అంచేత ఇండియాలో ఇరవైలలో అరవైలలా బ్రతికిన నేను అమెరికాలో అరవైలలో ఇరవైలలా బ్రతుకుతున్నాను.” అన్నారు.
అది I –TV లో విన్న నాకు అమెరికా జీవితం గురించి కనువిప్పు కలిగింది. అప్పటినుండి నేను చూసిన, విన్న అమెరికా భారతీయ జీవనంలోని అనుభవాలు శతపత్రదళ పుష్పంలా వికసించడం మొదలుపెట్టాయి.
27 మార్చి 2009
వాసా విశాలాక్షిగారు న్యూయార్కులో సంగీతం టీచరు. కర్ణాటక సంగీతానికి చేతులడ్డుపెట్టి ఒక ‘కాపు’ కాస్తున్నాం అని అనుకొంటున్న ఎందరో వ్యక్తుల కంటే, సంస్థల కంటే, ఎక్కువ. ‘పెద్దకాపు’ వాసా విశాలాక్షి గారు. ముప్పైఏళ్ళుగా ఆవిడ న్యూయార్క్ లో ఉన్నారని గాని, ఎంతో సంగీత సేవ చేస్తున్నారని కాని మనం న్యూయార్కులో ఎన్నాళ్ళున్నా మీకు నాకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆమెని ఏ సంఘాలు గుర్తించలేదు. అవార్డులు ఇవ్వలేదు. ఇండియా ఎబ్రాడ్ న్యూస్ పేపరులో వ్రాయలేదు. ఆవిడ చేస్తున్న సేవని, ఆవిడ ఉనికిని నలుగురికి తెలిసేలా చేసింది ఓ తెల్లవాడు. అతడికి సంగీతంకాని, భారతదేశం గురించికాని ఏమీ తెలీదు. అసలు భారతదేశం అనేది ఉందని కూడా తెలియదు.
అతడికి తెలిసిందంతా రోజూ ‘ఎలాగో ఒకలాగ’ డబ్బులు ‘సంపాదించి’ ‘డ్రగ్స్’ తీసుకొని ఆనందో బ్రహ్మ అని జీవితం గడపడం. అలాంటి వాడికి సంగీత విద్వాంసురాలు, పూజ చెయ్యకుండా పచ్చి మంచినీళ్ళు అయినా ముట్టని, పరాయివాళ్ళ ఇళ్ళల్లో పళ్ళు తప్ప మరేమీ తినని ఛాందసురాలైన వాసా విశాలాక్షి గారికి లింకేమిటని ఆశ్చర్యపోకండి. ఉంది.
ప్రతిరోజూ ఉదయం పూజ చేసుకొని, మడిగా వంట వండి భర్తకి పెట్టి, తాను తిని, పట్టుచీర కట్టుకొని లోపల థెర్మల్స్ (చలిని తట్టుకోడానికి తొడుక్కునే లోపలి గుడ్డలు) తొడుక్కోకని, మఫ్లర్ కట్టుకొని, న్యూయార్కు బస్సులలో, సబ్ వేలో తిరుగుతూ అభిరుచి ఉన్న వాళ్ళకి సంగీత పాఠాలు చెప్పడం ఆమె దినచర్యలో భాగం. అటువంటి ఆమెని ఒకరోజు సబ్వేలో ఓ తెల్లవాడు అటకాయించి ‘మగ్గింగ్’ అనే మెనహటనం స్టైల్ ముష్టికై ప్రయత్నించాడు. ఆమె మగ్గింగ్ కోసం దాచుకొన్న ఐదు డాలర్లు ఇచ్చే అంతలో ఆమె శృతి పెట్టెని పట్టుకొన్నాడు. అపుడు శృతి పెట్టె పట్టుకొన్న ఆమె చెయ్యిని తాకాడు. ఐదు డాలర్లు ఇద్దామనుకొన్న ఆమెకి వాడు చెయ్యి తాకడం వల్ల మడికి భంగం అయి కోపం వచ్చింది.
“ముష్టి వెధవ్వి ముష్టి వెధవలా ఉండక ముట్టుకొని నా మడిని మైల చేస్తావా?” అని అరిచింది. ఆమె ఆవేశాన్ని ఆమె గాత్రం అద్భుతంగా అనువదించింది. పక్కవాడు చచ్చిపోతున్నా పట్టించుకోని జనాన్ని నిలబెట్టింది. గొడవైంది. పోలీసులొచ్చారు. ఓస్ ఇంతేనా? అని వెళ్ళిపోయారు. అలాంటి పోలీసుల్ని ఆపి ‘మడి’ దాని ప్రాముఖ్యత గట్రా వివరించారు. అటువంటి తప్పుని అమెరికా ఖండంలో చేసేవారిని వదిలేస్తే ఈ ఖండం అపవిత్రమైపోతుందన్నారు. ముష్టి వాళ్ళు ముష్టి అడగడం మనం ఇవ్వడం సనాతన ధర్మం అని చెప్పారు. ఆమె చెపుతున్న విషయం కంటే ఎంతసేపైనా వినాలనిపించే ఆమె గొంతు వినడానికై మరిన్ని ప్రశ్నలు వేసారు పోలీసులు. ముచ్చటపడి కేసు రాసి, నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. అమెరికాలో క్రైం న్యూసు ఎక్కువ. కాని అందులో ఇండియన్ పేర్లు అతి తక్కువ. అంచేత మనం ఇక్కడ ఉన్నామని నలుగురికి తెలియదని, న్యూయార్కు అంటే ‘మెల్టింగ్ పాట్’ అని అది సంస్కృతుల సంగమం అని అందులో ఇవాళ ‘మడి’ అనే భారతీయ సంస్కృతికి సంబంధించిన విషయం అమెరికాలో క్రైం కి కొత్త కోణాన్ని ఇస్తుందని న్యూయార్కులోని ఇండియన్ ప్రెస్ విజృంభించింది.
వాసా విశాలాక్షిగారి ఇంటి ఎడ్రస్ పట్టుకొన్నారు. కెమేరాలు వెంట తెచ్చుకొన్నారు. ఆమెని వివిధ ప్రశ్నలు వేసారు. ఆమెకి ఇది ప్రథమ ఇంటర్వ్యూ అవడం వల్ల ఆమే ఏ సమాధానం చెప్పకుండా ముందు ‘మహా గణపతిం....’ అంటూ మొదలు పెట్టారు. ఆ తరవాత ఆమె అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పారు. ఆమె జీవిత చరిత్ర అంతా వివరించారు. మగ్గింగ్ పాలబడ్డా మరేమి జరిగినా అమెరికానే నచ్చిందన్నారు. విలేఖర్లు వివరంగా చెప్పమన్నారు. ఎన్నో కారణాలు వివరాలు ఎందుకు ఒక్కటి చాలన్నారు ఆమె. ఆ సమాధానమే ‘అమెరికాలో అరవైలలో ఇరవై, ఇండియాలో ఇరవైలలో అరవై.’ అదెలా అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది ఇరవైలలో ఉన్న జుహి ఝం ఝాంగ్ వాలా అన్న విలేఖరిణి.
‘నాకు ఇరవైయవ ఏట పెళ్ళైంది. నేను వాళ్ళింట కాలు పెట్టిన వేళా విశేషమేమో కాని నా భర్తకి ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది. తుళ్ళుతూ, తేలుతూ, తిరుగుతూ సంగీతం ఊపిరిగా బ్రతుకుతున్న మా పల్లెటూరి నుండి’ ఢిల్లి వెళ్ళిన నాకు అదో పెద్ద జైలులా అనిపించింది. వాసావారింటి అబ్బాయి అని మానాన్న నన్ను ఒప్పించి చేసిన పెళ్ళి నాది. వారి ఇంట ఉన్న సంగీత సంప్రదాయాన్ని గౌరవించి అటువంటి కుటుంబంలో పుట్టిన ఆయనకి ‘ఇంగువ కట్టిన గుడ్డ’ లా ఎంతో కొంత సంగీతం రాదా అని అనుకొన్నాం. అయితే అది మా రోజుల్లో పెళ్ళిచూపుల్లో పెళ్ళి కూతురు అడిగే ప్రశ్న లేదుకదా. పెళ్ళైన తరువాత తెలుసుకొందాం అని వాయిదా వేసాను. ఢిల్లీ వెళ్ళిన తరువాత తెలిసింది అది ‘ఇంగువ కట్టిన గుడ్డే’ కాని మా ఆయన తరంలో అది ‘సర్ఫ్’ వేసి శుభ్రంగా ఉతికి ఆరేసిన బట్ట అని. ఆయనకి సంగీతం రాకపోతేనేం నలుగురికి పాఠాలు చెప్పుకొని నా సంగీతాన్ని నిలబెడదాం అనుకొన్నాను. కాని కుదిరేది కాదు. రోజు తెల్లవారు ఝామున మూడు గంటలకి లేచి నీళ్ళుపట్టుకోవాలి. ఐదు గంటలకి పాలబూత్ దగ్గరికి వెళ్ళి పాలు తెచ్చుకోవాలి. ఆరుగంటలకి భర్తనిలేపి కాఫీ అందించాలి. ఏడు గంటలకి పిల్లల్ని లేపి తయారు చెయ్యాలి. వంట చెయ్యాలి. వాళ్ళను బస్సెక్కించాలి. భర్తకి టిఫిన్ పెట్టాలి. కేరేజ్ కట్టి ఇవ్వాలి. మార్కెట్ కి వెళ్ళాలి. ఆ తరువాత ఇంత తిని పడుకొందామంటే కుదరదు. కొత్తగా కొన్న టీవి చూడడానికి రోజూ పొరుగువాళ్ళు వస్తారు. కునికిపాట్ల మధ్య చూస్తూ లేస్తూ ఉండేసరికి పిల్లలు వచ్చేస్తారు. రాత్రి పదిదాకా ఏవేవో పనులు. పడుకొనేసరికి పదకొండు. మళ్ళీ తెల్లవారు ఝామున మూడు గంటలకి లేవడం. అలా పనిచేసి చేసి నా ఇరవైలలో అరవై ఏళ్ళ దానిలా తయారయ్యాను. నాకు వచ్చిన సంగీతానికి కనీసం ఓ గంటైనా ఆ రోజుల్లో దొరికేది కాదు. కాని ఇపుడు అరవైలలో అమెరికాలో నాకు నచ్చిన సంగీతాన్ని నలుగురికి నేర్పుకొంటున్నాను. అంచేత ఇండియాలో ఇరవైలలో అరవైలలా బ్రతికిన నేను అమెరికాలో అరవైలలో ఇరవైలలా బ్రతుకుతున్నాను.” అన్నారు.
అది I –TV లో విన్న నాకు అమెరికా జీవితం గురించి కనువిప్పు కలిగింది. అప్పటినుండి నేను చూసిన, విన్న అమెరికా భారతీయ జీవనంలోని అనుభవాలు శతపత్రదళ పుష్పంలా వికసించడం మొదలుపెట్టాయి.
27 మార్చి 2009
0 వ్యాఖ్యలు:
Post a Comment