జగన్నాధం గారు రిటైర్ అయి చాలా కాలం అయ్యింది. ఆ ఊరి చుట్టుప్రక్కల గ్రామాలలో ముప్పైఏళ్ళ పైబడ్డ సర్వీసు ఉన్న టీచర్ ఆయన. పాఠాలు చెప్పడమే కాకుండా, పల్లెలలోని ప్రజలకు ఉత్తరాలు వ్రాసి పెట్టేవారు. కోర్టు కాగితాలు చదివి బోధపడే దాకా వివరిస్తారు. ఆయన చుట్టుప్రక్క గ్రామాలలో ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ తన జీవితం సాఫీగా సాగించారు. రిటైరైనా కూడా ఊర్లో, ఊరి చుట్టుప్రక్కల గ్రామాల్లో ప్రజలకు ఏదో విధంగా ఉపయోగపడుతూ ఉద్యోగం చేస్తున్నంత బిజీగా ఉంటారు. రోజూ ఉదయం లేచిన దగ్గర నుండి ఇంగ్లీషు పాఠాలు, ప్రభుత్వ కార్యాలయానికి దరఖాస్తులు, పురపాలక సంఘం వారికి అర్జీలు, రిటైర్ అయిన వాళ్ళ ఫించన్ విషయాలు, బేంక్ విషయాలు, ఇలా ఎన్నో రకాల పనులతో ఆయన అందరి మనిషిగా అన్ని పనులు తనవే అన్నట్లు చేస్తారు. చదువుకోడానికి పిల్లలకి ప్రభుత్వం ఇచ్చే స్కాలర్ షిప్ లు తెప్పించడం, అర్హత అగ్రకులాల బీద పిల్లలకు తనకు వీలైన డబ్బులు ఇచ్చి, నలుగురి చేత ఇప్పించి వారి చదువు పూర్తి అయ్యేలా చూస్తారు. చదువు పూర్తి అయిన వాళ్ళకి ఉద్యోగాలకి దరఖాస్తులు ఎలా పెట్టాలో, ఇంటర్య్వూలకి ఎలా తయరవ్వాలో కూడా చెబుతారు. అవసరం అయితే అర్హతలున్న వారికి తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఉద్యోగాలు వేయిస్తారు. ఊర్లో ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచే వెళ్ళేవారు. అందువల్ల ఆయనతో చాలామందికి పరిచయం ఉంది.
ఆయన ఇంటి వీధి చివరన ఉన్న ఐదురోడ్ల జంక్షన్లో క్రిష్ణ ఉంటాడు. అతడికి ఒక కిల్లీకొట్టు ఉంది. సాయంత్రం సాధారణంగా అక్కడ నిలబడి కబుర్లు చెప్పుకుంటారు చాలామంది. ఒకరోజు జగన్నాధంగారు అక్కడ నిలబడి కబుర్లాడుతూ సోడా తాగుతున్నారు, ఈయన్ని చూసి ఆ జంక్షన్ లోంచి వెళుతున్న ఆ ఊరి ఎమ్.ఎల్.ఏ కారు, దానివెనక వస్తున్న మరో రెండు కార్లు హఠాత్తుగా జంక్షన్లో ఆగాయి. కారులోంచి ఎమ్.ఎల్.ఏ ఆయన అనుచరులు దిగారు.
“ఒరేయ్ జగన్నాధం మేష్ట్రు.....” అని ఎమ్.ఎల్.ఏ అరిచాడో, పిలిచాడో తెలియని గొంతుతో గట్టిగా అన్నాడు. ట్రాఫిక్ ఆగిపోయింది. మనుషులు కదలకుండా నిలబడిపోయారు. జగన్నాధం గారికి అటు ఇటు ఉన్న వ్యక్తులు ఆయనకు దూరంగా జరిగారు. జగన్నాధంగారు ఎక్కడ ఉన్నారో అక్కడ కదలకుండా నిలబడ్డారు. ఎమ్.ఎల్.ఏ అతని వైపే పెద్ద పెద్ద అంగలతో నడిచి వెళ్ళాడు. గుంపు ఉత్కంఠతో ఏం జరుగుతుందా అని చూస్తున్నారు.
“ ముసిలోళ్ళ ఫించన్లని, ఇళ్ళ స్థలాలని నా అపోజిషన్ లో ఉన్న మాల, మాదిగల చేత అప్లికేషన్లు పెట్టిస్తావుట్రా? నన్నెదిరించాలను కొంటున్నారా? ఆనా కొడుకులు వంగి దండం పెట్టేదాకా ఆళ్ళకి ప్రభుత్వం నుండి చీపురు పుల్లకూడా అందదు. కలక్టర్ కే అర్జీలు పెట్టిస్తావురా. నువ్వు పెట్టించిన ధరఖాస్తులన్నీ ఆ కలక్టర్ గాడి చేత్తోనే చింపించాను. ఏం చేసుకొంటావో చేసుకో. జాగ్రత్త?” అని అందరి వైపు తిరిగి “నాతో పెట్టుకోవద్దు” ఓ వార్నింగ్ ఇచ్చాడు.
“ఎమ్.ఎల్.ఎ గారూ! మీ నియోజక వర్గంలో ఉన్న చాలా గ్రామాలలో పని చేసాను. ఆ గ్రామాలలో ఉన్న వాళ్ళు ఏ కులం వాళ్ళయిన నాకు కావలసిన మనుషులే వారిని కులాలతో చూడలేదు. గవర్నమెంటు పధకాలకి అర్హులైన వారితో అర్జీలు పెట్టిస్తున్నాను. వాళ్ళకి రావలసిన ఫించన్లు, లోనులు, ఇళ్ళస్థలాలు....” జగన్నాధం మాటలని లెఖ్ఖ పెట్టకుండా
“నామనుషులైతేనే అవి వస్తాయి. నాకు ఓటేస్తేనే వస్తాయి. తెలుసుకో నా నియోజక వర్గంలో ఉన్న వాళ్ళంతా నా ప్రజలు. ఎవరికి ఏంచెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను, నామనుషులు చూసుకొంటాం. నువ్వు నోరు మూసుకొని ఉండు” అన్నాడు ఎమ్.ఎల్.ఏ ఆవేశంతో ఊగిపోతూ.
“నేను దరఖాస్తు పెట్టించిన వాళ్ళంతా ఏడాదిగా ఎదురు చూస్తున్న వాళ్ళే. వాళ్ళకి .......... ఏదో చెప్పబోతుండగానే” మళ్ళీ అతని మాటలకి అడ్డు వస్తూ “నువ్వు ఏ మాల మాదిగ నా కొడుకులకి సాయం చెయ్యాలనుకుంటున్నావో వాళ్ళ చేతనే నీమీద ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం క్రింద కేసు పెట్టిస్తాను జాగ్రత్త” అని మరింత ఆవేశంతో గట్టిగా అరిచాడు. అందరూ చూస్తూ నిలబడ్డారు. ఒక్కరు కాలు కదపలేదు. నోరు మెదపలేదు. వాతావరణం అంతా స్థంభించి పోయినట్లుంది. ఎమ్.ఎల్.ఏ ఆవేశంగా ఊగిపోతున్నాడు.
“ప్రజల్నీ, చట్టాల్నీ పావుల్లా వాడుకోవడం కాదు. ప్రజలకు సేవ చేయాలి. అదీ రాజకీయ నాయకుని ధర్మం!” అని జగన్నాధం మాష్టారు నిర్బయంగా, గట్టిగా, రాజకీయాల్లో ఉన్న అందర్ని ఉద్దేశించి అన్నారు.
“ఇళ్ళిప్పిస్తానని మామూలు ప్రజల దగ్గర డబ్బులు కాజేసేవాళ్ళు కబడ్దార్. వాళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం సహించను” అన్నారు మేష్టారు.
“ఏమన్నావురా నాకొడకా.......” అంటూ ఆవేశంతో ఊగిపోయాడు ఎమ్.ఎల్.ఎ జగన్నాధం. మాష్టారివైపు వస్తున్న అతని వెనక అతని అనుచరులూ కదిలారు. పెద్ద కలకలం రేగింది. ఇంతలో ఆవేశం ఎక్కువై కాబోలు భారీ కాయం ఉన్న ఎమ్.ఎల్.ఎ ఒక్కసారి తూలిపోయాడు. అతని అనుచరులు వచ్చి పట్టుకున్నారు. చెమటతో ఒళ్ళు తడిసిపోయింది. ఢీలాపడి వెనక్కి వాలిపోయాడు. కిల్లీకొట్టు క్రిష్ణ వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని పరుగున వచ్చి ఎమ్ఎల్ఏ మొహం మీద నీళ్ళు చిలకరించాడు. ఆ జనంలోంచి జగన్నాధాన్ని బయటకు తీసుకు వెళ్ళిపోయారు. కిల్లీకొట్టు క్రిష్ణ ఒక గోలీ సోడా కొట్టి ఎమ్.ఎల్.ఏ గారి చేత మెల్లిగా తాగించాడు. కోలుకున్న ఎమ్.ఎల్.ఎ ని ఆయిన మనుషులు కారెక్కించి తీసుకెళ్ళిపోయారు.
ఇదంతా చూస్తున్న జనం బొమ్మల్లా నిలబడిపోయారు. అప్పటికే అక్కడికి చేరిన కాలేజి కుర్రాళ్ళు స్కూలుపిల్లలు, పెద్దలు ఎమ్.ఎల్.ఎని నడిరోడ్డుమీద ‘ఖబడ్దార్’ అనగలిగిన మొగాణ్ణి చూసినందుకు చాలా గర్వించారు, ఆనందించారు. ఆక్షణం ఆవార్త దావానలంలా వ్యాపించింది. ఊర్లో అందరూ ఆయిన్ని ‘ఖబడ్దార్ మాష్టారు’ అని పిలుస్తుంటారు.
పబ్లిక్ గా మేష్టారితో గొడవపెట్టుకున్నందుకు ఎమ్.ఎల్.ఎ ని వాళ్ళ నాన్న తిట్టాడు. మేష్టారి లాంటి వాళ్ళను ఎలా డీల్ చేయాలో చెప్పాడు తన వ్యాపారవేత్త అయిన తన అన్న. అందరి దృష్టి ఆనాటి సంఘటన మీద ఉండిపోయింది. అపోజిషన్ వాళ్లు దీన్ని పెద్దది చేయాలని చూశారు. మేష్టారు అందుకు అంగీకరించలేదు. మేష్టార్ని అలా తిట్టడం మంచిది కాదని, అందువల్ల ఆమేష్టర్ని మరేం అనడం కాని, చెయ్యడం కాని మంచిది కాదని అనుకున్నాడు.
* * *
కొంతకాలం తరువాత ప్రజలు ఈ విషయం మరిచిపోయారు.
కిల్లీకొట్టు క్రిష్ణకి కొంత పలుకుబడి ఉంది. పైగా సమయానికి సోడా అందించాడన్న కృతజ్ఞతతో ఎమ్.ఎల్.ఏ, మనుషులు క్రిష్ణని చేరదీసారు.
కిల్లీ కొట్టు క్రిష్ణకి ఈ సంఘటనతో ఎమ్.ఎల్.ఎతో పరిచయం అయింది.
లోలోన కిల్లీకొట్టును మించి ఇంకా ఎదగాలన్న ఆశ ఉంది. ఏదో చేయాలన్న తపన క్రిష్ణని ఊర్కోనివ్వడం లేదు. రాజకీయాల్లోకి ఎలా చేరాలో సరిగ్గా తెలియలేదు. సరిగ్గా అటువంటి సమయంలో ఇటువంటి అవకాశం రావడం ఊహించలేకపోయాడు. రాత్రి పగలు రాయకీయాల గురించి ఆలోచించడం, పేపరులో రాజకీయాలు చదవడం, ఎమ్.ఎల్.ఎ తోనో అతని అనుచరులతోనో ప్రజా సమస్యలను చర్చించడం మొదలుపెట్టాడు. దాంతో వచ్చిన కొత్త పలుకుబడి వల్ల కిల్లీకొట్టు వ్యాపారం కూడా పెరిగింది.
మూడేళ్ళలో ఎమ్.ఎల్.ఎకి కొంత దగ్గరయ్యాడు. పార్టీలో చేరాలని చాలామంది మిత్రులు ప్రోత్సహించారు. ఇంతలోనే ముందస్తుగా ఎలక్షన్లు వస్తున్నాయి అన్న వార్త అతనికి కొంత ఆనందం కలిగించింది. ఎలక్షన్ల ముందు ఎంతో మందిని పార్టిలో చేర్చే కార్యక్రమం ఉంటుంది. దాన్ని లాఛనంగా కిల్లీకొట్టు క్రిష్ణతో మొదలుపెట్టాలని ఎమ్.ఎల్.ఏ నిర్ణయించుకున్నాడు. ఓ వంద మందిని పార్టీలో చేర్పించమని కబురు పెట్టాడు. వచ్చేనెల పెద్ద ఫంక్షన్ పెట్టి మంత్రుల్ని రప్పించి క్రిష్ణని, క్రిష్ణ చేర్పించబోయే వారిచేత ప్రమాణం చేయించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ చేరబోయే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక వందమందిని వచ్చే నెలరోజుల్లో చేర్పించేందుకు తగిన పథకం వేశారు. ఆ విధంగా పార్టీలోకి రాబోతున్న వెయ్యిమందికి తాను లీడర్ అవుతానన్నది క్రిష్ణకి అనిపించింది. ఎమ్.ఎల్.ఏ కొడుకు చిన్నవాడు. తమ్ముడు వేరే పార్టీలో ఉన్నాడు. అన్న వ్యాపారంలో ఉన్నారు. ఇంక సరియైన వారసుడు క్రిష్ణే అని అతని మిత్రులు నూరిపోశారు. ఇలాకాకుండా క్రిష్ణకి తాను ఇంకా ఏవో మంచి పనులు చేయాలని అనిపిస్తూ ఉండేది.
రాబోతున్న ఎన్నికల హడావిడితో ఎమ్.ఎల్.ఎ భవంతి కోలాహలంగా ఉంది. ఆ వీధి చివరలో ఉన్న క్రిష్ణ కిల్లీకొట్టు మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. క్రిష్ణ చదువుకునే తన తమ్ముడిని కిల్లీకొట్లో కూర్చోబెట్టాడు. ఇవాళో రేపో ఎమ్.ఎల్.ఎ.కి మళ్ళీ టికెట్టు రాగానే ఊరూరా ప్రచారం మొదలవ్వాలి. సరిగ్గా అటువంటి సమయంలో హైదరాబాదు నుండి పిడుగు లాంటి వార్త వచ్చింది. ఎమ్.ఎల్.ఎ.కి ఈఎలక్షన్ లో ఈ నియోజకవర్గం నుండి టిక్కెట్టు ఇవ్వడంలేదని. అది విన్న ఎమ్.ఎ.ల్ఎ. ఆవేశపడి పార్టీలో ఉన్న పెద్దలు అందరికి ఫోన్ చేశాడు. తన కోపాన్ని ప్రదర్శించారడు. టిక్కెట్టు ఎవడికి ఇచ్చారో తెలిస్తే వాడి అంతు చూస్తానన్నాడు. హైబీపీ ఉన్నా సరే ఎమ్.ఎల్.ఎ. విశ్రాంతి తీసుకోలేదు, డాక్టర్ల మాట పెడచెవిన పట్టి, రెండురోజుల పాటు రాత్రి పగలు టిక్కెట్టు కోసం చేయరాని ప్రయత్నాలు చేసాడు. ఆ టిక్కెట్టు ఇచ్చింది తన్ని రాజకీయాలోకి పంపి, వెనకదన్నుగా ఉన్న వ్యాపరవేత్త ఆ తన అన్నకే అని తెలిసి తట్టుకోలేకపోయాడు. తన అండతోనే దొంగ వ్యాపారం చేస్తూ బాగా డబ్బులు సంపాదించిన తన అన్నే తనకి తెలీకుండానే మాయోపాయాలతో టిక్కెట్టు కొట్టేశాడు. ఈసారి పార్టీకోసం విశ్వాసంగా పని చేస్తే వచ్చే ఎన్నికలకి సీటు ఇస్తామని వాగ్దానం చేసింది పార్టీ. ఇంత మోసం తట్టుకోలేకపోయాడు. ఏమాత్రం ఊహించలేకపోయాడు. ఐనా చివరి ప్రయత్నంగా హైదరాబాదు పోయాడు. అక్కడే చివరి ఆశ విడిచాడు.
ఎమ్.ఎల్.ఎ మరణవార్త విన్న క్రిష్ణకి కాళ్ళు చేతులు ఆడలేదు. రాజకీయమంటే ఇంత క్రూరంగా ఉంటుందా అని విస్తుపోయాడు. తన భవిష్యత్ ఏమిటో అన్న ఆలోచనల నల్లమేఘం కమ్మింది. తను, తను తీసుకొచ్చిన వందమంది, వాళ్ళు తీసుకొని రాబోయే వెయ్యిమంది క్రిష్ణ శ్రేయోభిలాషులు అతనికి ధైర్యం చెప్పారు. లేచి చెయ్యవలసిన పనులు చెయ్యమన్నారు ఎమ్.ఎల్.ఎ అభ్యర్థికి కోపం వస్తుందేమో అని. ఎమ్.ఎల్.ఎ అంత్యక్రియల్లో చాలామంది ముఖం చాటేశారు. అందుకే క్రిష్ణని ముఖ్యమైన పాత్ర తీసుకోమన్నారు స్నేహితులు. పోయిన ఎమ్.ఎల్.ఎ కి క్రిష్ణ వారసుడన్నారు. ఎమ్.ఎల్.ఎ అంత్యక్రియలని కుటుంబంలోని ఒక వ్యక్తిలా ఏర్పాటు చెయ్యడం మొదలు పెట్టాడు. కేవలం మానవతా ధృక్పధంతోనే వేలలో జనం వస్తారని దానికి తగిన ఏర్పాట్లు చెయ్యసాగాడు. తన కిల్లీకొట్టుకి వచ్చే జనానికి సరిపోయే నీళ్ళపేకట్లు, సోడాలు ఉచితంగా ఇవ్వవలసి వస్తుందని ముందుగా డబ్బుపెట్టి సరుకు తెచ్చి ఉంచాడు. అంత్యక్రియలరోజు ఉదయం పాడె సిద్ధం చేసారు. ప్రజలు వచ్చిన తరువాత ఒక ఊరేగింపుగా స్మశానానికి తీసుకెళ్ళాలని నిశ్చయించారు.
ఉదయం తొమ్మిది గంటలైంది. ఎమ్.ఎల్.ఎ ఇంటి ముందు పదీపదిహేను మందికంటే ఎక్కువ మనుషులు లేరు. పదిగంటలైనా యాబైమంది మించలేదు. పన్నెండు అయ్యింది. ఆ ఉన్నవాళ్ళలో కొంతమంది ఇప్పుడే వస్తామని వెళ్ళారు. క్రిష్ణ ప్రయత్నంతో అతి కష్టం మీద సాయంకాలం నాలుగు గంటలకి ఓ వందమంది పోగయ్యారు. ఇక (క్రిష్ణే మరణించిన ఎమ్.ఎల్.ఎ రాజకీయ వారసుడు, శిష్యుడు అని చావూలోనూ పొగిడారు. ఎమ్.ఎల్.ఎ శవయాత్ర అతి సాధారణంగా ముగిసింది. ప్రస్తుత అభ్యర్థి రాజధానికి పని ఉందని చెప్పి వెళ్ళాడు. ఇటు మనుషులు రాక, తెప్పించిన సామాను చెల్లుబడి కాక క్రిష్ణ పరిస్థతి అయోమయంగా మారింది. ఆరాత్రి ఎలాగో అతికష్టం మీద నిద్రపోయాడు. ఇన్ని రోజులు పడ్డ అలసట వల్ల కాబోలు.
* * *
ఏడింటికే ఎండాకాలం సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. “క్రిష్ణా లే! లే! కొట్టు తియ్యాలి. అంటూ తట్టి లేపుతున్న తల్లి మాటలకి క్రిష్ణ కళ్ళు తెరిచాడు.
“టైం ఎంతైందేంటి?” అన్నాడు మత్తుగా
“ఏడు గంటలు అయింది. కాని.....”
“ఏడేనా? ….. మరో గంట పడుకోనీ. ఇవాళ లేటుగా తీస్తా కొట్టు” అని దుప్పటి ముసుగు పెట్టుకొన్నాడు.
“లే..... లే.....” అని తల్లి ముసుగు లాగేస్తూ కొట్టు కాడ మనుషులు నీళ్ళ పేకట్ల కోసం చూస్తున్నారు లే!
“ఇంత ఉదయాన్న...........”
“అవును. ఏమో మరి కొట్టు తలుపు కొడుతున్నారు అరగంటనుండి.” క్రిష్ణ లేచి, మొహం కడుక్కొని “అమ్మ! టీ ఇవ్వవే” అని చెప్పి ఇంటిముందు భాగంలో ఉన్న కొట్టు వైపు వెళ్ళాడు. అక్కడ అప్పటికే 20-30 మంది మనుషులు నిలబడి ఉన్నారు. వాళ్ళెవరూ రోజూ వచ్చే వాళ్ళు కారు. అయినా ఇంత ఉదయం ఎందుకు వచ్చారో అని అనుకొన్నాడు. అదే వాళ్ళని అడిగాడు.
“మా మేష్టారు గారు సనిపోనారండీ.......” అన్నాడు ఒక పల్లెటూరి నాయుడు. తన ఇంట్లోని మనిషి చనిపోయినంత దీనమైన గొంతుతో.
“ఏ మేష్టారు...” క్రిష్ణ తాళం తీస్తూ అడిగాడు.
“అదే మన ఖబడ్దార్ మాష్టారు” అన్నాడు అపుడే అక్కడకు చేరిన క్రిష్ణ కొట్లో పనిచేసే కుర్రాడు.
తాళం తీసి తలుపులా అమర్చిన ఒక్కొక్క చెక్క తీసి పక్కన పెడుతున్న క్రిష్ణ ఎపుడో తన కొట్టు ముందు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. చెయ్యి జారి చేతిలో చెక్క కాలుమీద పడింది. కాలు జివ్వుమని లాగింది.
అయిదు రోడ్ల జంక్షన్లో ఒకరోడ్డు చివర ఖబడ్దార్ మాష్టారు ఇల్లుంది. అటువైపు తిరిగి చూసాడు. ఆ వీధిలో చాలామంది మనుషులు గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు.
కొట్టు, బేరాలు కొట్లో పనిచేసే కుర్రాడికి అప్పచెప్పి క్రిష్ణ ఖబడ్దార్ మాష్టారింటివైపు దారి తీశాడు. రోడ్డు నిండా జనం. ఒకరితో ఒకరు ఏవేవో చెప్పుకొంటున్నారు.
“మా కుర్రాడు అయిదరాబాదులో ఈ రోజు ఉద్యోగంలో ఉన్నాడంటే ఈ మేష్టారి దయే బాబు” అని ఓ పల్లెటూరి ఆసామి.
“నా పెనిమిటి పోతే నా మడిసెక్క నాకు మిగిలేలా చేసిందీ బాబే” అని ఓ రైతు భార్య.
“నాకీ వయసులో ఒక పూటైనా ముద్ద ఉందంటే ఈ బాబు సలవే” రోడ్డు మధ్యలో కూర్చొన్న ఓవృద్దుడు.
“మా ఊరు బాగుపడిందంటే ఈయన మా స్కూలు హెడ్ మాష్టార్ గా ఉన్నందువల్లే” ఓ గ్రామపెద్ద.
“పదిమంది పదిరకాలుగా మంచిమాటలు చెప్పుకుంటున్నారు.”
క్రిష్ణ రోడ్డుమీద ఉన్న మనుషులను తప్పించుకొంటూ వారి మధ్యనుండి వెళుతుంటే ఇటువంటి మాటలు చాలానే వినిపించాయి. ఎంతోమంది కళ్ళు తుడుచుకుంటుంటే చూసాడు. యాంత్రికంగా ఖబడ్దార్ మాష్టారింటివైపు వెళ్ళాడు. ఆయన శవాన్ని ఇంటిముందు పాడెమీద ఏర్పాటు చేశారు. రోడ్డుకు అటువైపు మరింతమంది జనం ఉన్నారు. చిన్న, పెద్ద, ఆడ, మొగ, ముసలి వారితో సహ అన్ని వయసుల వాళ్ళు చక్కని బట్టలు కట్టుకున్న వాళ్ళు, ఒంటిమీద సరియైన బట్టలు లేని వాళ్ళు, చుట్టుపక్కల పల్లెలనుండి ఆదరాబాదరగా వచ్చినవాళ్ళు, ఆయన్ని ఒక్కసారి చూడాలని ఆత్రంగా ఉన్నవాళ్ళు, నలభైఏళ్ళ ఉపాధ్యాయవృత్తిలో ఆయన తిరిగిన ఎన్నో ఊళ్ళలోని ప్రజలు, ఆయన సహాయం అందుకొన్న సామాన్యులు, ఏళ్ళ తరబడి ఆయిన మంచితనాన్ని గుర్తుంచుకొని ఇవాళ కడసారి చూపుకోసం వచ్చిన వాళ్ళతో ఆ అయిదు రోడ్ల జంక్షన్ నిండిపోయింది. అక్కడొక శోక ప్రవాహం కనిపించింది క్రిష్ణకి.
దూరం నుండి వచ్చిన వాళ్ళు దాహానికి క్రిష్ణ కిల్లీకొట్టులో నీళ్ళపేకట్లు కొంటున్నారు.
క్రిష్ణ తిరిగి వచ్చేటప్పటికి కొట్లో పనిచేసే కుర్రాడు ఓ వంద పేకట్లు అమ్మానని చెప్పాడు. క్రిష్ణ మాట్లాడకుండానే చేత్తో పేకట్లు అమ్మొద్దని చెప్పాడు.
“అదేంటన్నా బేరం జోరుగా సాగుతున్నది. నిన్న తెప్పించినవి ఏవీ అమ్మలేకపోయాం. ఇవాళ అన్నీ ఒక్క గంటలో అమ్మేయ్యచ్చు..............”అంటున్నాడు.
“అమ్మొద్దు... అడిగిన వాళ్ళందరికి ఫ్రీగా తలా ఒక నీళ్ళ పేకెట్టు ఇయ్యి” అని చెప్పి ప్రక్కన ఉన్న స్కూటర్ తీసి మరిన్ని పేకట్లు ఆర్డరు పెట్టి వస్తాను అన్నాడు స్కూటర్ స్టార్టు చేస్తూ.
మధ్యాహ్నానికి క్రిష్ణ కొట్లోనే ఓ వెయ్యి నీళ్ళ పేకట్లు ఉచితంగా అందించారు. మనుషులు ప్రవాహంలా వస్తున్నారు, పోతున్నారు. సాయింత్రం 5 గంటలయ్యేసరికి ఓ వెయ్యిమంది పైబడ్డ జనంతో ఖబడ్దార్ మాష్టారి అంతిమయాత్ర ఘనంగా జరిగింది. ఆ వందలాది మంది సహాయం అందించడానికి ముందుకి వచ్చారు.
* * *
మర్నాటి ఉదయం అన్ని పేపర్లలో ‘ప్రజల మాష్టారు అస్తమయం, లోటు పూడ్చలేని ఉపాధ్యాయుని మృతి అని పెద్ద పెద్ద అక్షరాలతో ఖబడ్దార్ మేష్టారి జీవిత వివరాలు అనేకం వెలువడ్డాయి. ఆయన బతికున్నప్పుడు చేసిన గుప్తదానం విశేషాలు, ప్రజల అభిప్రాయాలతో వివరంగా ఓ పేజి వ్యాసం జిల్లా సెంటర్ స్ప్రెడ్ లో వచ్చింది. ఈ పల్లెల్లో పేదప్రజలని ఆదుకునే దయామయుడిని కోల్పోయిందనే వార్త మెయిన్ పేపర్లో రాశారు. ఈ చుట్టు ప్రక్కల పల్లె ప్రజలని విద్యవైపు ప్రోత్సహించాడని, ఆర్ధిక సహాయం చేస్తూ ఇతరులతో చేయిస్తూ వందలాది విద్యార్థుల్ని ప్రోత్సహించాడనీ, ఎన్నో కుటుంబాలని నిలబెట్టే ఆ వ్యక్తి మరికి లేడు అని పత్రికలన్నీ పొగిడాయి. అదే పేజీలో ఆ ఊరి ఎమ్.ఎల్.ఎ పోయాడనే వార్త నిన్న చాలా చిన్నగా వెలువడింది.
క్రిష్ణ ఆరెండింటిని చదివాడు. చదివిన తరువాచ ఏదో ఆలోచనలో పడిపోయాడు. పది గంటలయ్యింది. ఐదురోడ్ల జంక్షన్ ట్రాఫిక్, మనుషులతో హడావిడిగా మారిపోయింది. ప్రస్తుతం టికెట్టు వచ్చి ఎమ్.ఎల్.ఎగా పోటీ చేస్తున్న ఆయిన అక్కడకు వచ్చారు. కృష్ణ లేచి నిలబడి కిల్లీకొట్టులోంచి బయటకు వచ్చాడు.
“క్రిష్ణా! ఎల్లుండి సాయంత్రం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంది నువ్వు, మీ వాళ్ళు సమయానికి వచ్చేయండి. మినిష్టర్ గారు కూడా వస్తారు.......” అంటున్న ఆయన్ని చూసి -
“అయ్యా! నమస్తే. నేను పార్టీలో చేరడం లేదండి. నన్ను వదిలి పెట్టండి. మిగిలిన వాళ్ళు వస్తే వాళ్ళని చేర్చుకోండి.” అన్నాడు మెల్లగా వినయంతో.
“అదేంటి క్రిష్ణా! నువ్వు మా తమ్ముడి కుడి భుజానివి. నీకు పార్టీలో మంచి భవిష్యత్ ఉంది. ఎందుకలా ఉన్నావు. పార్టీలో చేరడానికి ఏంకావాలో చెప్పు” బుజ్జిగించబోయాడు క్రిష్ణని. వచ్చి కారులో తన పక్కన కూర్చోమని సైగ చేశాడు ఎం.ఎల్.ఏ
“నేను ప్రజలకు సేవ చేద్దాం అనుకొంటున్నానండి.......” అన్నాడు మెల్లిగా.
“మరి పార్టిలో చేరకుండా ప్రజలకి సేవ ఎలా చేస్తావ్?” నవ్వుతూ కొంటెగా అన్నాడు.
ఒక్క క్షణం నిశ్శబ్దం. ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు క్రిష్ణ. కాసేపాగి చెప్పక తప్పదు కదా అనుకొని “ఖబడ్దార్ మాష్టారి శిష్యుడిగా!” అన్నాడు క్రిష్ణ ధృడంగా.
అప్పటికే గుమికూడిన క్రిష్ణ అనుయాయులు అది విని ఉత్సాహంతో చప్పట్లు కొట్టసాగారు.
ఒక మాష్టారు తన ఆచరణతో రాజకీయ నాయకులకి చెక్ పెట్టగలడు. మంచి మేష్టారెప్పుడూ ప్రజలవైపుంటాడు. విద్యాసంస్థలో పాఠాలు చెప్పడమే కాదు, తన చదువుని ప్రజలకు వినియోగించడమే విజ్ఞత. అంతటి మంచి మేష్టారు జీవితం క్రిష్ణని బాగా ఆలోచింప చేసింది. నిరక్ష్యరాస్యుడైన క్రిష్ణ మాష్టారి మరణం తరువాత ఆయనకి మొదటి శిష్యుడయ్యాడు. ఒకసారి మాష్టారి రూపాన్ని గుర్తు తెచ్చుకున్నాడు.
క్రిష్ణలో ఒక్కసారి చైతన్యం నిండింది.
* * *
శ్రీ అనపర్తి సుబ్బారావు మాస్టారిని తలుచుకుంటూ)
ఆయన ఇంటి వీధి చివరన ఉన్న ఐదురోడ్ల జంక్షన్లో క్రిష్ణ ఉంటాడు. అతడికి ఒక కిల్లీకొట్టు ఉంది. సాయంత్రం సాధారణంగా అక్కడ నిలబడి కబుర్లు చెప్పుకుంటారు చాలామంది. ఒకరోజు జగన్నాధంగారు అక్కడ నిలబడి కబుర్లాడుతూ సోడా తాగుతున్నారు, ఈయన్ని చూసి ఆ జంక్షన్ లోంచి వెళుతున్న ఆ ఊరి ఎమ్.ఎల్.ఏ కారు, దానివెనక వస్తున్న మరో రెండు కార్లు హఠాత్తుగా జంక్షన్లో ఆగాయి. కారులోంచి ఎమ్.ఎల్.ఏ ఆయన అనుచరులు దిగారు.
“ఒరేయ్ జగన్నాధం మేష్ట్రు.....” అని ఎమ్.ఎల్.ఏ అరిచాడో, పిలిచాడో తెలియని గొంతుతో గట్టిగా అన్నాడు. ట్రాఫిక్ ఆగిపోయింది. మనుషులు కదలకుండా నిలబడిపోయారు. జగన్నాధం గారికి అటు ఇటు ఉన్న వ్యక్తులు ఆయనకు దూరంగా జరిగారు. జగన్నాధంగారు ఎక్కడ ఉన్నారో అక్కడ కదలకుండా నిలబడ్డారు. ఎమ్.ఎల్.ఏ అతని వైపే పెద్ద పెద్ద అంగలతో నడిచి వెళ్ళాడు. గుంపు ఉత్కంఠతో ఏం జరుగుతుందా అని చూస్తున్నారు.
“ ముసిలోళ్ళ ఫించన్లని, ఇళ్ళ స్థలాలని నా అపోజిషన్ లో ఉన్న మాల, మాదిగల చేత అప్లికేషన్లు పెట్టిస్తావుట్రా? నన్నెదిరించాలను కొంటున్నారా? ఆనా కొడుకులు వంగి దండం పెట్టేదాకా ఆళ్ళకి ప్రభుత్వం నుండి చీపురు పుల్లకూడా అందదు. కలక్టర్ కే అర్జీలు పెట్టిస్తావురా. నువ్వు పెట్టించిన ధరఖాస్తులన్నీ ఆ కలక్టర్ గాడి చేత్తోనే చింపించాను. ఏం చేసుకొంటావో చేసుకో. జాగ్రత్త?” అని అందరి వైపు తిరిగి “నాతో పెట్టుకోవద్దు” ఓ వార్నింగ్ ఇచ్చాడు.
“ఎమ్.ఎల్.ఎ గారూ! మీ నియోజక వర్గంలో ఉన్న చాలా గ్రామాలలో పని చేసాను. ఆ గ్రామాలలో ఉన్న వాళ్ళు ఏ కులం వాళ్ళయిన నాకు కావలసిన మనుషులే వారిని కులాలతో చూడలేదు. గవర్నమెంటు పధకాలకి అర్హులైన వారితో అర్జీలు పెట్టిస్తున్నాను. వాళ్ళకి రావలసిన ఫించన్లు, లోనులు, ఇళ్ళస్థలాలు....” జగన్నాధం మాటలని లెఖ్ఖ పెట్టకుండా
“నామనుషులైతేనే అవి వస్తాయి. నాకు ఓటేస్తేనే వస్తాయి. తెలుసుకో నా నియోజక వర్గంలో ఉన్న వాళ్ళంతా నా ప్రజలు. ఎవరికి ఏంచెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను, నామనుషులు చూసుకొంటాం. నువ్వు నోరు మూసుకొని ఉండు” అన్నాడు ఎమ్.ఎల్.ఏ ఆవేశంతో ఊగిపోతూ.
“నేను దరఖాస్తు పెట్టించిన వాళ్ళంతా ఏడాదిగా ఎదురు చూస్తున్న వాళ్ళే. వాళ్ళకి .......... ఏదో చెప్పబోతుండగానే” మళ్ళీ అతని మాటలకి అడ్డు వస్తూ “నువ్వు ఏ మాల మాదిగ నా కొడుకులకి సాయం చెయ్యాలనుకుంటున్నావో వాళ్ళ చేతనే నీమీద ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం క్రింద కేసు పెట్టిస్తాను జాగ్రత్త” అని మరింత ఆవేశంతో గట్టిగా అరిచాడు. అందరూ చూస్తూ నిలబడ్డారు. ఒక్కరు కాలు కదపలేదు. నోరు మెదపలేదు. వాతావరణం అంతా స్థంభించి పోయినట్లుంది. ఎమ్.ఎల్.ఏ ఆవేశంగా ఊగిపోతున్నాడు.
“ప్రజల్నీ, చట్టాల్నీ పావుల్లా వాడుకోవడం కాదు. ప్రజలకు సేవ చేయాలి. అదీ రాజకీయ నాయకుని ధర్మం!” అని జగన్నాధం మాష్టారు నిర్బయంగా, గట్టిగా, రాజకీయాల్లో ఉన్న అందర్ని ఉద్దేశించి అన్నారు.
“ఇళ్ళిప్పిస్తానని మామూలు ప్రజల దగ్గర డబ్బులు కాజేసేవాళ్ళు కబడ్దార్. వాళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం సహించను” అన్నారు మేష్టారు.
“ఏమన్నావురా నాకొడకా.......” అంటూ ఆవేశంతో ఊగిపోయాడు ఎమ్.ఎల్.ఎ జగన్నాధం. మాష్టారివైపు వస్తున్న అతని వెనక అతని అనుచరులూ కదిలారు. పెద్ద కలకలం రేగింది. ఇంతలో ఆవేశం ఎక్కువై కాబోలు భారీ కాయం ఉన్న ఎమ్.ఎల్.ఎ ఒక్కసారి తూలిపోయాడు. అతని అనుచరులు వచ్చి పట్టుకున్నారు. చెమటతో ఒళ్ళు తడిసిపోయింది. ఢీలాపడి వెనక్కి వాలిపోయాడు. కిల్లీకొట్టు క్రిష్ణ వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని పరుగున వచ్చి ఎమ్ఎల్ఏ మొహం మీద నీళ్ళు చిలకరించాడు. ఆ జనంలోంచి జగన్నాధాన్ని బయటకు తీసుకు వెళ్ళిపోయారు. కిల్లీకొట్టు క్రిష్ణ ఒక గోలీ సోడా కొట్టి ఎమ్.ఎల్.ఏ గారి చేత మెల్లిగా తాగించాడు. కోలుకున్న ఎమ్.ఎల్.ఎ ని ఆయిన మనుషులు కారెక్కించి తీసుకెళ్ళిపోయారు.
ఇదంతా చూస్తున్న జనం బొమ్మల్లా నిలబడిపోయారు. అప్పటికే అక్కడికి చేరిన కాలేజి కుర్రాళ్ళు స్కూలుపిల్లలు, పెద్దలు ఎమ్.ఎల్.ఎని నడిరోడ్డుమీద ‘ఖబడ్దార్’ అనగలిగిన మొగాణ్ణి చూసినందుకు చాలా గర్వించారు, ఆనందించారు. ఆక్షణం ఆవార్త దావానలంలా వ్యాపించింది. ఊర్లో అందరూ ఆయిన్ని ‘ఖబడ్దార్ మాష్టారు’ అని పిలుస్తుంటారు.
పబ్లిక్ గా మేష్టారితో గొడవపెట్టుకున్నందుకు ఎమ్.ఎల్.ఎ ని వాళ్ళ నాన్న తిట్టాడు. మేష్టారి లాంటి వాళ్ళను ఎలా డీల్ చేయాలో చెప్పాడు తన వ్యాపారవేత్త అయిన తన అన్న. అందరి దృష్టి ఆనాటి సంఘటన మీద ఉండిపోయింది. అపోజిషన్ వాళ్లు దీన్ని పెద్దది చేయాలని చూశారు. మేష్టారు అందుకు అంగీకరించలేదు. మేష్టార్ని అలా తిట్టడం మంచిది కాదని, అందువల్ల ఆమేష్టర్ని మరేం అనడం కాని, చెయ్యడం కాని మంచిది కాదని అనుకున్నాడు.
* * *
కొంతకాలం తరువాత ప్రజలు ఈ విషయం మరిచిపోయారు.
కిల్లీకొట్టు క్రిష్ణకి కొంత పలుకుబడి ఉంది. పైగా సమయానికి సోడా అందించాడన్న కృతజ్ఞతతో ఎమ్.ఎల్.ఏ, మనుషులు క్రిష్ణని చేరదీసారు.
కిల్లీ కొట్టు క్రిష్ణకి ఈ సంఘటనతో ఎమ్.ఎల్.ఎతో పరిచయం అయింది.
లోలోన కిల్లీకొట్టును మించి ఇంకా ఎదగాలన్న ఆశ ఉంది. ఏదో చేయాలన్న తపన క్రిష్ణని ఊర్కోనివ్వడం లేదు. రాజకీయాల్లోకి ఎలా చేరాలో సరిగ్గా తెలియలేదు. సరిగ్గా అటువంటి సమయంలో ఇటువంటి అవకాశం రావడం ఊహించలేకపోయాడు. రాత్రి పగలు రాయకీయాల గురించి ఆలోచించడం, పేపరులో రాజకీయాలు చదవడం, ఎమ్.ఎల్.ఎ తోనో అతని అనుచరులతోనో ప్రజా సమస్యలను చర్చించడం మొదలుపెట్టాడు. దాంతో వచ్చిన కొత్త పలుకుబడి వల్ల కిల్లీకొట్టు వ్యాపారం కూడా పెరిగింది.
మూడేళ్ళలో ఎమ్.ఎల్.ఎకి కొంత దగ్గరయ్యాడు. పార్టీలో చేరాలని చాలామంది మిత్రులు ప్రోత్సహించారు. ఇంతలోనే ముందస్తుగా ఎలక్షన్లు వస్తున్నాయి అన్న వార్త అతనికి కొంత ఆనందం కలిగించింది. ఎలక్షన్ల ముందు ఎంతో మందిని పార్టిలో చేర్చే కార్యక్రమం ఉంటుంది. దాన్ని లాఛనంగా కిల్లీకొట్టు క్రిష్ణతో మొదలుపెట్టాలని ఎమ్.ఎల్.ఏ నిర్ణయించుకున్నాడు. ఓ వంద మందిని పార్టీలో చేర్పించమని కబురు పెట్టాడు. వచ్చేనెల పెద్ద ఫంక్షన్ పెట్టి మంత్రుల్ని రప్పించి క్రిష్ణని, క్రిష్ణ చేర్పించబోయే వారిచేత ప్రమాణం చేయించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ చేరబోయే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక వందమందిని వచ్చే నెలరోజుల్లో చేర్పించేందుకు తగిన పథకం వేశారు. ఆ విధంగా పార్టీలోకి రాబోతున్న వెయ్యిమందికి తాను లీడర్ అవుతానన్నది క్రిష్ణకి అనిపించింది. ఎమ్.ఎల్.ఏ కొడుకు చిన్నవాడు. తమ్ముడు వేరే పార్టీలో ఉన్నాడు. అన్న వ్యాపారంలో ఉన్నారు. ఇంక సరియైన వారసుడు క్రిష్ణే అని అతని మిత్రులు నూరిపోశారు. ఇలాకాకుండా క్రిష్ణకి తాను ఇంకా ఏవో మంచి పనులు చేయాలని అనిపిస్తూ ఉండేది.
రాబోతున్న ఎన్నికల హడావిడితో ఎమ్.ఎల్.ఎ భవంతి కోలాహలంగా ఉంది. ఆ వీధి చివరలో ఉన్న క్రిష్ణ కిల్లీకొట్టు మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. క్రిష్ణ చదువుకునే తన తమ్ముడిని కిల్లీకొట్లో కూర్చోబెట్టాడు. ఇవాళో రేపో ఎమ్.ఎల్.ఎ.కి మళ్ళీ టికెట్టు రాగానే ఊరూరా ప్రచారం మొదలవ్వాలి. సరిగ్గా అటువంటి సమయంలో హైదరాబాదు నుండి పిడుగు లాంటి వార్త వచ్చింది. ఎమ్.ఎల్.ఎ.కి ఈఎలక్షన్ లో ఈ నియోజకవర్గం నుండి టిక్కెట్టు ఇవ్వడంలేదని. అది విన్న ఎమ్.ఎ.ల్ఎ. ఆవేశపడి పార్టీలో ఉన్న పెద్దలు అందరికి ఫోన్ చేశాడు. తన కోపాన్ని ప్రదర్శించారడు. టిక్కెట్టు ఎవడికి ఇచ్చారో తెలిస్తే వాడి అంతు చూస్తానన్నాడు. హైబీపీ ఉన్నా సరే ఎమ్.ఎల్.ఎ. విశ్రాంతి తీసుకోలేదు, డాక్టర్ల మాట పెడచెవిన పట్టి, రెండురోజుల పాటు రాత్రి పగలు టిక్కెట్టు కోసం చేయరాని ప్రయత్నాలు చేసాడు. ఆ టిక్కెట్టు ఇచ్చింది తన్ని రాజకీయాలోకి పంపి, వెనకదన్నుగా ఉన్న వ్యాపరవేత్త ఆ తన అన్నకే అని తెలిసి తట్టుకోలేకపోయాడు. తన అండతోనే దొంగ వ్యాపారం చేస్తూ బాగా డబ్బులు సంపాదించిన తన అన్నే తనకి తెలీకుండానే మాయోపాయాలతో టిక్కెట్టు కొట్టేశాడు. ఈసారి పార్టీకోసం విశ్వాసంగా పని చేస్తే వచ్చే ఎన్నికలకి సీటు ఇస్తామని వాగ్దానం చేసింది పార్టీ. ఇంత మోసం తట్టుకోలేకపోయాడు. ఏమాత్రం ఊహించలేకపోయాడు. ఐనా చివరి ప్రయత్నంగా హైదరాబాదు పోయాడు. అక్కడే చివరి ఆశ విడిచాడు.
ఎమ్.ఎల్.ఎ మరణవార్త విన్న క్రిష్ణకి కాళ్ళు చేతులు ఆడలేదు. రాజకీయమంటే ఇంత క్రూరంగా ఉంటుందా అని విస్తుపోయాడు. తన భవిష్యత్ ఏమిటో అన్న ఆలోచనల నల్లమేఘం కమ్మింది. తను, తను తీసుకొచ్చిన వందమంది, వాళ్ళు తీసుకొని రాబోయే వెయ్యిమంది క్రిష్ణ శ్రేయోభిలాషులు అతనికి ధైర్యం చెప్పారు. లేచి చెయ్యవలసిన పనులు చెయ్యమన్నారు ఎమ్.ఎల్.ఎ అభ్యర్థికి కోపం వస్తుందేమో అని. ఎమ్.ఎల్.ఎ అంత్యక్రియల్లో చాలామంది ముఖం చాటేశారు. అందుకే క్రిష్ణని ముఖ్యమైన పాత్ర తీసుకోమన్నారు స్నేహితులు. పోయిన ఎమ్.ఎల్.ఎ కి క్రిష్ణ వారసుడన్నారు. ఎమ్.ఎల్.ఎ అంత్యక్రియలని కుటుంబంలోని ఒక వ్యక్తిలా ఏర్పాటు చెయ్యడం మొదలు పెట్టాడు. కేవలం మానవతా ధృక్పధంతోనే వేలలో జనం వస్తారని దానికి తగిన ఏర్పాట్లు చెయ్యసాగాడు. తన కిల్లీకొట్టుకి వచ్చే జనానికి సరిపోయే నీళ్ళపేకట్లు, సోడాలు ఉచితంగా ఇవ్వవలసి వస్తుందని ముందుగా డబ్బుపెట్టి సరుకు తెచ్చి ఉంచాడు. అంత్యక్రియలరోజు ఉదయం పాడె సిద్ధం చేసారు. ప్రజలు వచ్చిన తరువాత ఒక ఊరేగింపుగా స్మశానానికి తీసుకెళ్ళాలని నిశ్చయించారు.
ఉదయం తొమ్మిది గంటలైంది. ఎమ్.ఎల్.ఎ ఇంటి ముందు పదీపదిహేను మందికంటే ఎక్కువ మనుషులు లేరు. పదిగంటలైనా యాబైమంది మించలేదు. పన్నెండు అయ్యింది. ఆ ఉన్నవాళ్ళలో కొంతమంది ఇప్పుడే వస్తామని వెళ్ళారు. క్రిష్ణ ప్రయత్నంతో అతి కష్టం మీద సాయంకాలం నాలుగు గంటలకి ఓ వందమంది పోగయ్యారు. ఇక (క్రిష్ణే మరణించిన ఎమ్.ఎల్.ఎ రాజకీయ వారసుడు, శిష్యుడు అని చావూలోనూ పొగిడారు. ఎమ్.ఎల్.ఎ శవయాత్ర అతి సాధారణంగా ముగిసింది. ప్రస్తుత అభ్యర్థి రాజధానికి పని ఉందని చెప్పి వెళ్ళాడు. ఇటు మనుషులు రాక, తెప్పించిన సామాను చెల్లుబడి కాక క్రిష్ణ పరిస్థతి అయోమయంగా మారింది. ఆరాత్రి ఎలాగో అతికష్టం మీద నిద్రపోయాడు. ఇన్ని రోజులు పడ్డ అలసట వల్ల కాబోలు.
* * *
ఏడింటికే ఎండాకాలం సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. “క్రిష్ణా లే! లే! కొట్టు తియ్యాలి. అంటూ తట్టి లేపుతున్న తల్లి మాటలకి క్రిష్ణ కళ్ళు తెరిచాడు.
“టైం ఎంతైందేంటి?” అన్నాడు మత్తుగా
“ఏడు గంటలు అయింది. కాని.....”
“ఏడేనా? ….. మరో గంట పడుకోనీ. ఇవాళ లేటుగా తీస్తా కొట్టు” అని దుప్పటి ముసుగు పెట్టుకొన్నాడు.
“లే..... లే.....” అని తల్లి ముసుగు లాగేస్తూ కొట్టు కాడ మనుషులు నీళ్ళ పేకట్ల కోసం చూస్తున్నారు లే!
“ఇంత ఉదయాన్న...........”
“అవును. ఏమో మరి కొట్టు తలుపు కొడుతున్నారు అరగంటనుండి.” క్రిష్ణ లేచి, మొహం కడుక్కొని “అమ్మ! టీ ఇవ్వవే” అని చెప్పి ఇంటిముందు భాగంలో ఉన్న కొట్టు వైపు వెళ్ళాడు. అక్కడ అప్పటికే 20-30 మంది మనుషులు నిలబడి ఉన్నారు. వాళ్ళెవరూ రోజూ వచ్చే వాళ్ళు కారు. అయినా ఇంత ఉదయం ఎందుకు వచ్చారో అని అనుకొన్నాడు. అదే వాళ్ళని అడిగాడు.
“మా మేష్టారు గారు సనిపోనారండీ.......” అన్నాడు ఒక పల్లెటూరి నాయుడు. తన ఇంట్లోని మనిషి చనిపోయినంత దీనమైన గొంతుతో.
“ఏ మేష్టారు...” క్రిష్ణ తాళం తీస్తూ అడిగాడు.
“అదే మన ఖబడ్దార్ మాష్టారు” అన్నాడు అపుడే అక్కడకు చేరిన క్రిష్ణ కొట్లో పనిచేసే కుర్రాడు.
తాళం తీసి తలుపులా అమర్చిన ఒక్కొక్క చెక్క తీసి పక్కన పెడుతున్న క్రిష్ణ ఎపుడో తన కొట్టు ముందు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. చెయ్యి జారి చేతిలో చెక్క కాలుమీద పడింది. కాలు జివ్వుమని లాగింది.
అయిదు రోడ్ల జంక్షన్లో ఒకరోడ్డు చివర ఖబడ్దార్ మాష్టారు ఇల్లుంది. అటువైపు తిరిగి చూసాడు. ఆ వీధిలో చాలామంది మనుషులు గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు.
కొట్టు, బేరాలు కొట్లో పనిచేసే కుర్రాడికి అప్పచెప్పి క్రిష్ణ ఖబడ్దార్ మాష్టారింటివైపు దారి తీశాడు. రోడ్డు నిండా జనం. ఒకరితో ఒకరు ఏవేవో చెప్పుకొంటున్నారు.
“మా కుర్రాడు అయిదరాబాదులో ఈ రోజు ఉద్యోగంలో ఉన్నాడంటే ఈ మేష్టారి దయే బాబు” అని ఓ పల్లెటూరి ఆసామి.
“నా పెనిమిటి పోతే నా మడిసెక్క నాకు మిగిలేలా చేసిందీ బాబే” అని ఓ రైతు భార్య.
“నాకీ వయసులో ఒక పూటైనా ముద్ద ఉందంటే ఈ బాబు సలవే” రోడ్డు మధ్యలో కూర్చొన్న ఓవృద్దుడు.
“మా ఊరు బాగుపడిందంటే ఈయన మా స్కూలు హెడ్ మాష్టార్ గా ఉన్నందువల్లే” ఓ గ్రామపెద్ద.
“పదిమంది పదిరకాలుగా మంచిమాటలు చెప్పుకుంటున్నారు.”
క్రిష్ణ రోడ్డుమీద ఉన్న మనుషులను తప్పించుకొంటూ వారి మధ్యనుండి వెళుతుంటే ఇటువంటి మాటలు చాలానే వినిపించాయి. ఎంతోమంది కళ్ళు తుడుచుకుంటుంటే చూసాడు. యాంత్రికంగా ఖబడ్దార్ మాష్టారింటివైపు వెళ్ళాడు. ఆయన శవాన్ని ఇంటిముందు పాడెమీద ఏర్పాటు చేశారు. రోడ్డుకు అటువైపు మరింతమంది జనం ఉన్నారు. చిన్న, పెద్ద, ఆడ, మొగ, ముసలి వారితో సహ అన్ని వయసుల వాళ్ళు చక్కని బట్టలు కట్టుకున్న వాళ్ళు, ఒంటిమీద సరియైన బట్టలు లేని వాళ్ళు, చుట్టుపక్కల పల్లెలనుండి ఆదరాబాదరగా వచ్చినవాళ్ళు, ఆయన్ని ఒక్కసారి చూడాలని ఆత్రంగా ఉన్నవాళ్ళు, నలభైఏళ్ళ ఉపాధ్యాయవృత్తిలో ఆయన తిరిగిన ఎన్నో ఊళ్ళలోని ప్రజలు, ఆయన సహాయం అందుకొన్న సామాన్యులు, ఏళ్ళ తరబడి ఆయిన మంచితనాన్ని గుర్తుంచుకొని ఇవాళ కడసారి చూపుకోసం వచ్చిన వాళ్ళతో ఆ అయిదు రోడ్ల జంక్షన్ నిండిపోయింది. అక్కడొక శోక ప్రవాహం కనిపించింది క్రిష్ణకి.
దూరం నుండి వచ్చిన వాళ్ళు దాహానికి క్రిష్ణ కిల్లీకొట్టులో నీళ్ళపేకట్లు కొంటున్నారు.
క్రిష్ణ తిరిగి వచ్చేటప్పటికి కొట్లో పనిచేసే కుర్రాడు ఓ వంద పేకట్లు అమ్మానని చెప్పాడు. క్రిష్ణ మాట్లాడకుండానే చేత్తో పేకట్లు అమ్మొద్దని చెప్పాడు.
“అదేంటన్నా బేరం జోరుగా సాగుతున్నది. నిన్న తెప్పించినవి ఏవీ అమ్మలేకపోయాం. ఇవాళ అన్నీ ఒక్క గంటలో అమ్మేయ్యచ్చు..............”అంటున్నాడు.
“అమ్మొద్దు... అడిగిన వాళ్ళందరికి ఫ్రీగా తలా ఒక నీళ్ళ పేకెట్టు ఇయ్యి” అని చెప్పి ప్రక్కన ఉన్న స్కూటర్ తీసి మరిన్ని పేకట్లు ఆర్డరు పెట్టి వస్తాను అన్నాడు స్కూటర్ స్టార్టు చేస్తూ.
మధ్యాహ్నానికి క్రిష్ణ కొట్లోనే ఓ వెయ్యి నీళ్ళ పేకట్లు ఉచితంగా అందించారు. మనుషులు ప్రవాహంలా వస్తున్నారు, పోతున్నారు. సాయింత్రం 5 గంటలయ్యేసరికి ఓ వెయ్యిమంది పైబడ్డ జనంతో ఖబడ్దార్ మాష్టారి అంతిమయాత్ర ఘనంగా జరిగింది. ఆ వందలాది మంది సహాయం అందించడానికి ముందుకి వచ్చారు.
* * *
మర్నాటి ఉదయం అన్ని పేపర్లలో ‘ప్రజల మాష్టారు అస్తమయం, లోటు పూడ్చలేని ఉపాధ్యాయుని మృతి అని పెద్ద పెద్ద అక్షరాలతో ఖబడ్దార్ మేష్టారి జీవిత వివరాలు అనేకం వెలువడ్డాయి. ఆయన బతికున్నప్పుడు చేసిన గుప్తదానం విశేషాలు, ప్రజల అభిప్రాయాలతో వివరంగా ఓ పేజి వ్యాసం జిల్లా సెంటర్ స్ప్రెడ్ లో వచ్చింది. ఈ పల్లెల్లో పేదప్రజలని ఆదుకునే దయామయుడిని కోల్పోయిందనే వార్త మెయిన్ పేపర్లో రాశారు. ఈ చుట్టు ప్రక్కల పల్లె ప్రజలని విద్యవైపు ప్రోత్సహించాడని, ఆర్ధిక సహాయం చేస్తూ ఇతరులతో చేయిస్తూ వందలాది విద్యార్థుల్ని ప్రోత్సహించాడనీ, ఎన్నో కుటుంబాలని నిలబెట్టే ఆ వ్యక్తి మరికి లేడు అని పత్రికలన్నీ పొగిడాయి. అదే పేజీలో ఆ ఊరి ఎమ్.ఎల్.ఎ పోయాడనే వార్త నిన్న చాలా చిన్నగా వెలువడింది.
క్రిష్ణ ఆరెండింటిని చదివాడు. చదివిన తరువాచ ఏదో ఆలోచనలో పడిపోయాడు. పది గంటలయ్యింది. ఐదురోడ్ల జంక్షన్ ట్రాఫిక్, మనుషులతో హడావిడిగా మారిపోయింది. ప్రస్తుతం టికెట్టు వచ్చి ఎమ్.ఎల్.ఎగా పోటీ చేస్తున్న ఆయిన అక్కడకు వచ్చారు. కృష్ణ లేచి నిలబడి కిల్లీకొట్టులోంచి బయటకు వచ్చాడు.
“క్రిష్ణా! ఎల్లుండి సాయంత్రం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంది నువ్వు, మీ వాళ్ళు సమయానికి వచ్చేయండి. మినిష్టర్ గారు కూడా వస్తారు.......” అంటున్న ఆయన్ని చూసి -
“అయ్యా! నమస్తే. నేను పార్టీలో చేరడం లేదండి. నన్ను వదిలి పెట్టండి. మిగిలిన వాళ్ళు వస్తే వాళ్ళని చేర్చుకోండి.” అన్నాడు మెల్లగా వినయంతో.
“అదేంటి క్రిష్ణా! నువ్వు మా తమ్ముడి కుడి భుజానివి. నీకు పార్టీలో మంచి భవిష్యత్ ఉంది. ఎందుకలా ఉన్నావు. పార్టీలో చేరడానికి ఏంకావాలో చెప్పు” బుజ్జిగించబోయాడు క్రిష్ణని. వచ్చి కారులో తన పక్కన కూర్చోమని సైగ చేశాడు ఎం.ఎల్.ఏ
“నేను ప్రజలకు సేవ చేద్దాం అనుకొంటున్నానండి.......” అన్నాడు మెల్లిగా.
“మరి పార్టిలో చేరకుండా ప్రజలకి సేవ ఎలా చేస్తావ్?” నవ్వుతూ కొంటెగా అన్నాడు.
ఒక్క క్షణం నిశ్శబ్దం. ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు క్రిష్ణ. కాసేపాగి చెప్పక తప్పదు కదా అనుకొని “ఖబడ్దార్ మాష్టారి శిష్యుడిగా!” అన్నాడు క్రిష్ణ ధృడంగా.
అప్పటికే గుమికూడిన క్రిష్ణ అనుయాయులు అది విని ఉత్సాహంతో చప్పట్లు కొట్టసాగారు.
ఒక మాష్టారు తన ఆచరణతో రాజకీయ నాయకులకి చెక్ పెట్టగలడు. మంచి మేష్టారెప్పుడూ ప్రజలవైపుంటాడు. విద్యాసంస్థలో పాఠాలు చెప్పడమే కాదు, తన చదువుని ప్రజలకు వినియోగించడమే విజ్ఞత. అంతటి మంచి మేష్టారు జీవితం క్రిష్ణని బాగా ఆలోచింప చేసింది. నిరక్ష్యరాస్యుడైన క్రిష్ణ మాష్టారి మరణం తరువాత ఆయనకి మొదటి శిష్యుడయ్యాడు. ఒకసారి మాష్టారి రూపాన్ని గుర్తు తెచ్చుకున్నాడు.
క్రిష్ణలో ఒక్కసారి చైతన్యం నిండింది.
* * *
శ్రీ అనపర్తి సుబ్బారావు మాస్టారిని తలుచుకుంటూ)
0 వ్యాఖ్యలు:
Post a Comment